షోలాపూర్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజాపూర్ గ్రామంలో గోల్ గుంబద్ ఉంది. దీని విశిష్ట మైన వాస్తు శైలి వల్ల భారతదేశ పురాతన సాంస్కృతిక చరిత్ర నందు ఒక అత్యంత ప్రముఖ స్థానాన్ని కల్గి ఉంది. ఈ కప్పు పాదాన్ని తామర, గులాబీ దళాలు చుట్టి అప్పుడే వికసించుచున్న మొగ్గ వలె కనిపించే ఈ గోల్ గుంబద్ అంటే సాహిత్యంలో గులాబీ కప్పు అనే అర్ధం ఉంది.
ఆ కాలంలోని ప్రసిద్ధ వాస్తు శిల్పి అయిన యఖూత్ అఫ్ దబుల్ చే 1656 లో నిర్మించబడిన ఈ కట్టడం ప్రధానంగా అప్పటి బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా స్మారకార్థం కట్టిన సమాధి.ఈ సమాధి 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ప్రపంచంలోనే అంత్యంత విలాసవంతమైన గదిగా పేరు పొందింది.
ఈ సమాధి లోపల కనబడే గుస గుసలాడే శాల లో ఒక చిన్న సున్నితమైన శబ్దమైనా సమాధి అవతలి వైపునకు వినిపించడం ఆ ప్రదేశపు శబ్ద లక్షణం కనుగొన్న అప్పటి అద్భుత వాస్తుశైలికి ఒక ఉదాహరణ.ఈ సమాధి నిర్మాణం అతి సామాన్యం గా ఉండి మీ కనులను తక్షణం ఆకర్షిస్తుంది., దీనిని డెక్కన్ కట్టడాల నిర్మాణ విజయంగా భావిస్తారు.