ఆదిల్ షా 1557 లో చాంద్ బాడి చెరువును నిర్మించాడు.బీజాపూర్ కు తూర్పు సరిహద్దున కల ఈ చెరువు నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది.విజయనగర సామ్రాజ్య పతనానంతరం కోటగా బీజాపూర్ నందు అనేక మంది ప్రజలు స్థిరపడ్డారు. 20 మిలియన్ లీటర్ల భారి నీటి నిల్వ సామర్ద్యం కల్గిన ఈ చెరువు బీజాపూర్ మొత్తం నగరానికి నీటిని సరఫరా చేయుటకు ఉపయోగపడేది.ఈ ప్రాంతంలో తర్వాతి కాలంలో కట్టిన చెరువులకు ఈ చెరువు ఒక ప్రామాణికంగా తీసుకొన్నారు. రాజకుటుంబీకులు తమ వినోదానికి విరామ సమయాన్ని గడపడానికి తర్వాత దీనిచుట్టు ఒక సంక్లిష్ట సున్నిత నిర్మాణం కట్టారు.అలీ ఆదిల్ షా భార్య అయిన చాంద్ బిబి పేరు ఈ చెరువుకు పెట్టారు.