ఈ ఆరామం సముద్ర మట్టానికి 3870 మీటర్ల ఎత్తులో ఉంది. 17వ శతాబ్దంలో, ధన్కర్, స్పితి లోయ రాజ్యానికి రాజధాని. స్పితి ప్రాంతానికి పొరుగు రాష్ట్రాల నుంచి అనేక దాడుల భయం ఉండేది. అందువల్ల, కొండ మీది ఈ మఠం వ్యూహాత్మక స్థానంలో ఉండి, శత్రువుల పై గూఢచర్యం చేసేందుకు అనువుగా ఉండేది. మఠంలో ఉన్న బహుళ అంతస్తుల భవన సముదాయం వల్ల ఇది ఒక కోట బురుజు లాగా కనిపిస్తుంది.
గాజు పీఠం లో ఒకటి వెనుక మరొకటిగా పేర్చబడిన నాలుగు బుద్ధుల మూర్తులతో కూడిన, వజ్రధరుని నిలువెత్తు విగ్రహం చూడగలిగే లాఖంగ్, కంజుర్ మరియు దుఖంగ్ అనే మూడు మందిరాలు, ఆరామం యొక్క ఐదు మందిరాలలో ఉన్నాయి. వసతి సౌకర్యాలు లేనందువల్ల, రాత్రిపూట బస చేయాలనుకునే వారు, డేరాలు మరియు నిద్రపోయే ఉపకరణ సంచులు తీసుకుని వెళ్ళాలి.