ఈ దేవాలయం తప్పక చూడదగినది. దీని విస్తీర్ణం సుమారుగా 266 అడుగులు X 78 అడుగులు కలిగి శ్రావణబెళగొళ పట్టణంలో అతి పెద్ద జైన మందిరంగా చెప్పబడుతుంది.
దీనిని హొయసల రాజు కోశాధికారి ముల్లా 1126 లో నిర్మించారు. ఈ దేవాలయాన్ని చాతుర్ వింశతి జైనాలయ అని కూడా అంటారు. దీనిపై విజయనగర కాలంకు చెందిన బుక్కరాయలు శిలా శాసనాలు కూడా ఉంటాయి. ఈ శాసనాలలో జైనులు, శ్రీ వైష్ణవులు మతపర యుద్ధాలు సాగించినట్లుగా కూడా వ్రాయబడింది. స్ధానికుల మేరకు భండారి ప్రసాద్ దేవాలయం వివిధ దశలలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో సభా మంటపం, అంతరాల, గర్భ గ్రిహ మరియు ముఖ మంటపం, అనేక దేవుడు, దేవతల అంటే యక్షి, బ్రహ్మ మరియు పద్మావతి మూర్తుల విగ్రహాలుంటాయి. 3 అడుగుల ఎత్తు జైన తీర్ధంకరులు కూడా ఉంటారు. ఈ దేవాలయంలోని మూడు ప్రవేశ ద్వారాల వద్ద అందమైన జంతువుల, మానవుల బొమ్మలు సుందరంగా చెక్కబడి ఉంటాయి. ప్రవేశ ద్వారంపై ఇంద్రుడిని 12 చేతులతో చెక్కారు. ప్రధాన ప్రవేశంలో మానసస్తంభం ఒకటి కనపడుతుంది.