కున్తిలాన్ గా ప్రసిద్ధి చెందిన పరీ మహల్ లేదా యక్షిణులు గృహం శ్రీనగర్ లోని చషం-ఎ-షాహి ఉద్యానవనం పైన ఉన్నది. ప్రముఖ మొఘల్ రాజు, షాజహాన్, యొక్క పెద్ద కుమారుడు దారా షికో దీనిని 17 వ శతాబ్దం యొక్క మధ్య భాగం లో నిర్మించాడు. దారా షికో తన సుఫీ సంగీత శిక్షకుడు, ముల్లా షా బడఖ్షి గౌరవార్ధం ఒక బౌద్ధ విహారం యొక్క శిథిలాల పై ఈ ఉద్యానవనం నిర్మించాడు. పరీ మహల్ ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రాల అభ్యాస కేంద్రంగా కూడా ఉంది. ఈ ఉద్యానవనం పొడవు మరియు వెడల్పు వరుసగా 122 మీటర్లు మరియు 62.5 మీటర్లు.
ఆరు డాబాలు గల ఈ ఉద్యానవనం దాల్ సరస్సు కి నైరుతి దిశ లో ఉంది. ఇతర మొఘల్ ఉద్యానవనాలు మాదిరి పరీ మహల్ ఉద్యానవనం లో నీటి సెలయేళ్ళు లేవు. డాబాల పై ఉండే నీటి తోట్టెలు ను విడివిడిగా భూగర్భ గొట్టాల సహాయంతో నింపుతారు. ఉద్యానవనం లో ఒక చలమ , వివిధ రకాల పువ్వులు మరియు పండ్ల చెట్లు పెరుగుతున్న పచ్చిక బయలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications