హజ్రత్ సుల్తాన్ అని కూడా పిలవబడే సుఫీ సంగీత సన్యాసి మఖ్దూం సాహిబ్ కి అంకితం చేయబడిన ఈ మందిరాన్ని శ్రీనగర్ లోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా భావిస్తారు. రెండు అంతస్తుల నిర్మాణం గల ఈ మందిరం హరి పర్బత్ కి దక్షిణం వైపు ఉంటుంది.హరి పర్బత్ కోట క్రింద గా ఉన్న మఖ్దూం సాహిబ్ మందిరం మొఘల్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది.
జనబాహుళ్యం లోని నమ్మకం ప్రకారం, మఖ్దూం సాహిబ్ దివ్య శక్తులు కలిగి ఉన్నారు. ఈ విశ్వాసం వల్లే వివిధ సంఘాల ప్రజలు కుల మతాలకు అతీతంగా అతని ఆశీర్వాదం పొందడం కోసం ఈ మందిరాన్ని సందర్శిస్తున్నారు. మఖ్దూం సాహిబ్ మందిరం ఏడాది పొడవునా సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.