శ్రీరంగపట్న సందర్శకులు గుంబజ్ కూడా దర్శించాలి. దీనినే టిప్పు సుల్తాన్ కోట అంటారు. 20 మీటర్ల ఎత్తుగల ఈ నిర్మాణం టిప్పు సుల్తాన్ మరియు అతని తల్లి ఫతిమా బేగం మరియు తండ్రి హైదర్ అలి ల సమాధిగా చెపుతారు. వీరే కాక టిపు సుల్తాను బంధువులు, ఇతర సమీపకుల సమాధులను కూడా చూడవచ్చు. ఈ సమాధి భవన సీలింగ్ గ్రానైట్ తో కప్పబడి అందమైన 36 గ్రానైట్ స్తంభాలు కలిగి ఉంది. 220 సంవత్సరాల పురాతన ఈ కోట భారతీయ మరియు ఇస్లాం శిల్ప శైలి నిర్మాణాలను పోలి ఉంటుంది. గుంబజ్ ద్వారాలు దంతంతో అలంకరించబడి ఉంటాయి.
ఈ దంతాన్ని లార్డ్ డల్హౌసీ కానుకగా ఇచ్చినట్లు చెపుతారు. మూడు ప్రవేశ ద్వారాలు బంగారు మరియు వెండి తో చేయబడ్డాయి. అయితే, వీటిని బ్రిటీష్ పాలకులు శ్రీరంగపట్టణం ఆక్రమించినపుడు వాటిని తమ సొంతం చేసుకున్నారు. నేటికి అవి లండన్ లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. కారిడార్లలోని నల్లని పెద్ద స్తంభాలతో పాటు లోపలి గోడలపై లక్కతో చిత్రించబడిన పులి చారలు కూడా చూడవచ్చు. ఈ కోట ఆవరణలోనే రంగనాధస్వామి దేవాలయం మరియు జుమా మసీదులను రెంటిని చూడవచ్చు. ఈ ప్రదేశం అందమైన తోట మధ్య మసీద్ ఎ ఎక్సా అనబడే మసీదుకు పక్కగా ఉంటుంది.



Click it and Unblock the Notifications