హళేబీడు అంటే ప్రాచీన నగరం అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని ద్వారసముద్రం అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. 12వ శతాబ్దంలో ఈ నగరం రాచరిక వైభవాలతో విలసిల్లింది. తర్వాతి కాలంలో ఈ నగరాన్ని బహమనీ సుల్తాన్లు కొల్లగొట్టటం చేత దానిని హళేబీడు అని పిలిచేవారు.
హళీబీడులోని పర్యాటక దృశ్యాలు
ఈ పట్టణంలో గల హొయసలేశ్వర మరియు శాంతలేశ్వర దేవాలయాలు అప్పటి పాలకుడు విష్ణువర్ధన మరియు రాణి శాంతల ఆదేశాలపై కేతుమల్ల నిర్మించాడు. 12వ శతాబ్దంలో పాలకులు జైన మతాన్ని అనుసరించినప్పటికి, ఈ ప్రాంతంలో అనేక శివాలయాలు వారిచే నిర్మించబడినవి కనపడతాయి. ఈ దేవాలయాల నిర్మాణంలో వారి రాచరిక వైభవం, సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎంతో అందంగా శిల్పాలు చెక్కబడ్డాయి. ప్రస్తుతం ఇది శిధిలమైన నగరం అయినప్పటికి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. హళీబీడు పట్టణ సందర్శన చేయాలంటే అక్టోబర్ నుండి జనవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ పట్టణంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 8962 మంది ప్రజలు నివసిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి మూలనుండి బస్సుపై ఈ పట్టణానికి చేరుకోవచ్చు.
కళలకు, శిల్ప సంపదలకు నెలవు అయిన ఈ పట్టణం చెన్న కేశవ దేవాలయంకల బేలూరు నుండి 16 కి.మీ. ల దూరంలో ఉంటుంది. హళీబీడును దేశంలో వారసత్వ ప్రదేశంగా తప్పక చూడవలసిన ప్రదేశంగా గుర్తించారు.