ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలి. ఇది చాళుక్యుల శిల్పకళలతో కనపడుతుంది. దీనిలో రెండు హొయసలుల చిహ్నాలు కనపడతాయి. ఈ రకంగా చాళుక్యుల మరియు హొయసలుల శిల్ప నైపుణ్యం కలిసి ప్రదర్శించబడుతుంది. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1319 లో కట్టినట్లు కాని అది కూలిపోయినట్లు, ఇక ఆపై పూర్వ వైభవం పొందనట్లు చెపుతారు.
అందంగా చెక్కబడిన గోడలు, సీలింగ్ మాత్రమే కాక, కేదారేశ్వర దేవాలయంలో మహాభారతం, భగవద్గీత, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాల చిత్రాలు సైతం కిందిభాగంలో చెక్కబడి కన్పిస్తాయి. పర్యాటకులు క్రిష్ణశిలతో నిర్మించిన కేదారేశ్వర శివ లింగాన్ని దేవాలయంలో చూస్తారు. ఉత్తర దిశగా జనార్ధన విగ్రహం ఉంటుంది. దక్షిణం వైపు బ్రహ్మ లింగం కనపడుతుంది. పర్యాటకులు దేవాలయంపై పర్యాటకులు మూడు శిఖరాలు చూస్తారు. పెద్దది మధ్యన, చిన్నవి దానికి ఇరుపక్కలా ఉంటాయి. ఉమా మహేశ్వర, భైరవ, వరాహ, తాండవేశ్వర మరికొన్ని ఇతర దేవుళ్ళ విగ్రహాలు శిఖరాలను వివరిస్తాయి. ఈ కట్టడాలు చాళుక్యుల కళా వైభవం, శిల్ప నైపుణ్యాలను తెలుపుతాయి.