బసాది హళ్ళి లో జైనుల మందిరాలు ఉంటాయి. చక్కగా పాలిష్ చేయబడి అద్దంలా మెరిసే స్తంభాలు మరియు మూడు మందిరాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఈ మూడు మందిరాలలోను పార్శ్వనాధ స్వామి దేవాలయం చాలా ఆకర్షణీయంగా 14 అడుగుల పొడవైన నల్లటి రాతిలో చెక్కబడి ఉంటుంది. పర్యాటకులు ఏడు తలల పామును కూడా ఇక్కడ చూడవచ్చు. హళేబీడు శిల్ప నైపుణ్యత అంతా దేవాలయ తలుపుల చెక్కడంలో కనపడుతుంది. దేవాలయానికి గల 12 స్తంభాలు వివిధ రకాల ఆకర్షణీయ చిత్రాలను కలిగి ఉంటాయి. ఒకదానితో మరొకటి ఏ మాత్రం పోలి ఉండవు. ప్రధానమైన ఈ ఆకర్షణలే కాక, ఈ ప్రదేశంలో ఆదినాధస్వామి దేవాలయం, శాంతినాధస్వామి దేవాలయాలు కూడా కనపడతాయి. ఏ రుసుము లేకుండానే ఈ దేవాలయాలు దర్శించవచ్చు. సమీపంలో ఉన్న హొయసలేశ్వర దేవాలయం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.