నలక్ నాడు ప్యాలెస్ ను కొడగు రాజు దొడ్డ రాజా వీరేంద్ర 1792 మరియు 1794 ల మధ్య నిర్మించారు. ఇది తడియాండమోల్ పర్వత శిఖర మొదటి భాగం దగ్గర యవకపాడి గ్రామంలో కలదు. ఈ ప్యాలెస్ ను కొడగు చివరి రాజు అయిన చిక్క వీర రాజేంద్ర తన వేట సమయంలో సురక్షితంగా వుండేందుకు హంటింగ్ లాడ్జిగా నిర్మించుకున్నాడు.
దీనిని నల్కు నాడు అరమనె అంటే నాలుగు గ్రామాల ప్యాలెస్ అని పిలిచేవారు. రెండు అంతస్తులు కల ఈ భవనం పైన తాటి ఆకుల కప్పు ఉంటుంది. ఈ నిర్మాణం ఎంతో చరిత్ర చెపుతుంది. అక్కడకల 12 స్తంభాలు మంచి చెక్కడాలతో ఉంటాయి. ట్రెక్కర్లు ఈ ప్యాలెస్ ను వారి బసకు ఉపయోగిస్తారు. నలకనాడు ప్యాలెస్ ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ అధీనం లేదా నిర్వహణలో ఉంది. తడియండమోల్ వెళ్ళే పర్యాటకులు ఈ ప్యాలెస్ తప్పక దర్శించాలి.