పడి లఘుతప్ప దేవాలయంలో ప్రధాన దైవం లఘుతప్ప. ఇది కూర్గ్ జిల్లాలోని కక్కాబే లోని తెగలైన కొడవల ప్రాచీన దేవాలయం. ఒక ఇతిహాసం మేరకు ఈ దేవాలయం 1810 లో లింగరాజేంద్ర అనే రాజు అతని పాలనలో నిర్మించాడు. అప్పటినుండి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంది.
లఘుతప్ప సుబ్రమణ్యుడి అవతారమని భక్తులు నమ్ముతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేముడిని పూజిస్తారు. వీరినే వరుణ దేవుడని కూడా భావించి పూజలు చేసి వర్షాలు పొందుతారు. ఈ దేవాలయంలో తులాభారం ప్రత్యేక ఆకర్షణ. తులాభారం చేయించే వ్యక్తి బరువుకు సమ బరువులో టెంకాయలు, పండ్లు, బియ్యం, వంటి వస్తువలను పెట్టి దేముడికి అర్పించుకుంటారు.
ఇక్కడి ప్రజల సాంప్రదాయ మరియు సాంస్కృతిక జీవనాలలో ఈ దేవాలయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. మార్చిలో ప్రతి ఏటా కలియార్చి పండుగ జరుగుతుంది. ఈ పండుగలో లఘుతప్ప విగ్రహాన్ని గుడినుండి మల్లమ్మ బెట్ట కొండ వరకు మరల వెనక్కు ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయక డ్యాన్సులు చేస్తారు. తడియాండమోల్ సందర్శించే పర్యాటకులు లఘుతప్ప దేవాలయం తప్పక చూడాలి.