తిరుమ కూడల్ నర్సిపూర్ కూడా ఒక యాత్రాస్ధలమే. తలకాడు నుండి 16 కి.మీ. లు ఉంటుంది. దక్షిణ భారత దేశంలో మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే కుంభ మేళ జరుగుతుంది. హిందువులకు ప్రయాగ స్ధాయి పుణ్యక్షేత్రంగాను, దక్షిణ కాశి గాను పేరుపడింది. ఈ పట్టణంలోని అన్ని దేవాలయాలకంటే కూడా ద్రావిడ శిల్ప నైపుణ్యం కల గుంజా నరసింహ స్వామి దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయంపై పెద్ద గోపురం, నాలుగు స్తంభాల మంటపం ఉంటాయి. ప్రతి ఏటా జరిగే రధోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. తిరుమకూడల్ నర్సిపూర్ పుణ్యక్షేత్రంగానే కాక, పురావస్తు ప్రాధాన్యత కూడా కలిగి ఉంది. ఈ ప్రాంతంలో శ్మశాన వాటికలు, రాతి పనిముట్లు, కుండల అవశేషాలు, మెటల్ వస్తువులు, పూసలు, గాజులు, జంతు అవశేషాలు, మానవ అవశేషాలు మరియు కలప వంటివి ఎన్నో తవ్వి బయటకు తీశారు.



Click it and Unblock the Notifications