ఒకప్పుడు ధృడంగా వున్న వసోతా, జయగడ్ కోటలు ఇప్పుడు శిదిలావస్థకు చేరుకున్నాయి. శివసాగర్ సరస్సు దగ్గర కొయినా అభయారణ్యం లోని హరిత వనాల లోపల నెలకొని వుంది వసోతా కోట. దీన్ని శిలాహర రాజు రెండో భోజరాజు నిర్మించగా తర్వాత శివాజీ మహారాజు చేతికి వచ్చింది. ఈ కోటను పూర్వం వ్యాఘ్రగడ కోటగా పిలిచేవారు – దీన్ని మూడు ప్రధాన కోటలుగా విభజించారు – జునా వసోతా, నవీన్ వసోతా, నాగేశ్వర్. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తున వున్న ఈ కోటకు నాలుగింట మూడు వైపులా నీరు వుంటుంది. ఈ కోటలు ఇప్పుడు ప్రమాదకరమైన స్ధలాలుగా మార్పు చెందాయి.



Click it and Unblock the Notifications