తవాంగ్ వైపు సేల నుండి షుమారు 21 కిలోమీటర్ల ముందు యుద్ధ సమయంలో చైనా సైనికులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన సాహస యుద్ధవీరుడు ఎం వి సి జస్వంత్ సింగ్ నిలయం ఉంది. 1962 ఇండో-చైనా యుద్ధ సమయంలో, ఈయన 72 గంటలకు పైగా చాలా తెలివిగా పోరాడారు. ఇతని ధైర్యవంతమైన, అద్భుతమైన ఉనికి ఇక్కడ సజీవంగా ఉండడంవల్ల ఈ పుడమికి గొప్ప కుమారునికి వందనాలు, నివాళులు అర్పించడానికి వచ్చే సందర్శకుల కోసం జస్వంత్ ఘర్ ఇప్పటికీ అద్భుతంగా నిర్వహించబడుతుంది.