మహా గొప్ప అద్వైత తత్వవేత్త అయిన శ్రీ ఆది శంకరుల వారు విశ్రమించిన ప్రదేశంగా శంకర సమాధిని పేర్కొంటారు. శ్రీ శంకరుల వారికి, 32 ఏళ్ళ వయసులో క్రీ.శ. 820 లో త్రిశూర్ లో మోక్షం సిద్ధించిందని నమ్మకం. ఈ సమాధి కి సమీపంలో శ్రీ శంకరుల వారికి ఒక మందిరాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ శంకరుల వారి ప్రతిమ ని భక్తజన దర్శనార్ధం ప్రతిష్టించారు.
సుందరమైన ప్రాంతం లో నిర్మించబడ్డ ఈ మందిరంలో శ్రీ శంకరుల వారి ఆధ్యాత్మిక వెలుగు భక్తులపై కురుస్తుంది. వీటిని విశ్వసించని వారైనా, ఈ ప్రాంతం లో ని ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆస్వాదించడానికి ఇక్కడికి విచ్చేస్తారు.