కంజీరపల్లి కేరళలోని కొట్టాయంలో కలదు. ఇది తాలూకా మరియు ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశంలో సిరియన్ క్రైస్తవులు అధిక జనాభాగా కలరు. జనాభాలో ముస్లింలు మరియు హిందువులు కూడా కలదరు. మతపర స్ధిరత్వాలు పట్టణ సంస్కృతిపై ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ పట్టణం పేరు అక్కడి కంజిం చెట్లు కారణంగా ఏర్పడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం నిండా కంజిం చెట్లు ఉండేవి. కొయ్యిన్ తెగల ప్రజలు ప్రారంభంలో ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. తర్వాతి కాలంలో తమిళులు స్ధిరపడ్డారు. దానితో ఆ ప్రాంతానికి వలస రాకలు, పోకలు ఆరంభమయ్యాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాండ్య రాజకుమారుడు స్వాధీనం చేసుకున్నాడు. మొదటగా ఇక్కడ స్ధిరపడిన తమిళులలో కన్ననూర్ చెట్టి కులం వారు వీరు, చెట్టినాడు గ్రామానికి చెందినవారు.
మతపర ఐక్యతకు ఒక గుర్తు
ఇక్కడి ఆకర్షణలు పరిశీలిస్తే, గణపతియార్ కోవిల్, సెయింట్ మేరీస్ చర్చి, మదురై మీనాక్షి దేవాలయం, నైనారు మసీదు, సెయింట్ డామొనిక్స్ సీరో మలబార్ కేధలిక్ కేధడ్రల్ వంటివిగా కనపడతాయి. గణపతియార్ దేవాలయం చాలా ప్రాచీనమైంది. పురాతన కాలంలో ఆచరించిన సంప్రాదాయాలకు అద్దంలా కనపడుతుంది. ఈ పట్టణంలో సిరియన్ కేధలిక్ క్రైస్తవులు అధిక సంఖ్యలో కలరు. వీరంతా ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా కల ప్రాంతమైన నిలక్కల్ వద్ద స్ధిరపడ్డారు.
ఇక్కడకల పజయ పల్లి లేదా సెయింట్ మేరీస్ ఓల్డ్ చర్చిని సుమారు 1449 లో మొదటి తెల్లవారైన పోర్చుగీసు పాలకులు ఇండియాకు రాకముందు నిర్మించారు. పర్యాటక ప్రధాన ఆకర్షణగా గల నైనారు మసీదును ప్రతి సంవత్సరం ముస్లిం భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ మసీదును అయ్యప భక్తుడుగా ప్రసిద్ధి కెక్కిన ముస్లిం ప్రవక్త పేరుపై నిర్మించారు.