కంజీరపల్లిలో ముస్లింలు కూడా అధికమే. వీరంతా ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారు. నైనారు మసీదు ప్రతి సంవత్సరం వేలాది ముస్లిం భక్తులను ఆకర్షిస్తుంది. ముస్లింలకు ప్రసిద్ధి చెందిన మసీదు. ఈ మతంవారి వలసలు కుమలే పర్వత ప్రాంతాలనుండి మొదలయ్యాయి. చాలామంది దక్షిణ పండినాడ్ లోని పులియాంగుండి మరియు తేన్ కాశీలనుండి వచ్చారు.
హిందువుల వలెనే వీరు కూడా ఇక్కడకు వలస వచ్చి స్ధిరపడినవారే. వీరు మొదటలో పిచ్చపల్లి మేడు రపల్లిలో తమ ప్రార్ధనలు చేసుకునేవారు. తర్వాత నైనారు మసీదు కట్టి ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ మసీదు. కె.కె. రోడ్డులో 24వ మైలు రాయి వద్ద కలదు. ఈ మసీదు అయ్యప్ప భక్తుడైన ముస్లిం ప్రవక్త పేరుపై నిర్మించబడింది.