గోగర్భం ఆనకట్ట నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంది. రాముడు, సీతా, లక్ష్మణుడితో పాటు హనుమంతునితో ఇక్కడ ఉన్నాడని నమ్మకం. హనుమంతుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశాన్ని జపాలి అనికూడా అంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో రామ కుండ౦ అని పిలువబడే చెరువు కూడా ఉంది. ఈ ప్రదేశంలో ప్రార్ధనలు చేస్తే ఉత్తమమైన ఫలితాలను పొందుతారని నమ్మకం. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో వినాయకుని ఆకారంలో ఉన్న విగ్రహాన్ని చెట్టు మొదట్లో చూడవచ్చు, వినాయకుడు తనకు తానుగా ఇక్కడ కనిపించాడని నమ్ముతారు.