ఇండియా లో కర్నాటక రాష్ట్రం ప్రసిద్ధ పర్యాటక స్థలం. అయితే, ఇక్కడ పర్యాటకత కర్ణాటకలోని ప్రత్యేతకత లలో ఒకటి. మైసూరులో తయారయే పట్టు లేదా గంధపు చెక్కల వాసనలు, మరువ లేని అనుభూతులు అందించే హంపి దృశ్యాలు , ఎంతో నిరాడంబరంగా ఉంటూ తమ ప్రత్యేకత చాటుకొనే చెన్నపట్న బొమ్మలు, కూడా కర్నాటక విశిష్టతను చాటుతాయి. ఆహార ప్రియులు మంగళూరు వంటలలో స్వర్గం చూస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రదేశం ఒక ప్రత్యేకత. కొన్ని తెలిసినవి మరికొన్ని తెలియనివి. ఈ చిత్రాలు చూడండి, కర్నాటక రాష్ట్రం ఎందుకు ప్రసిద్ధి గాంచినదో తెలుసుకోండి.

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
మైసూరు పట్టణం గంధపు ఉత్పత్తులకు , సోప్ లకు, గంధపు నూనేలకు, అగర వత్తులకు, గంధపు చెక్కల బొమ్మలకు ప్రసిద్ధి. మైసూరు అక్కడ దొరికే సిల్క్ చీరలకు కూడా ప్రసిద్ధి. ఈ చీరల ప్రత్యేకత అంటే, వీటి తయారీలో అసలైన పట్టు, అసలైన జరీ వాడతారు. మైసూరు సిటీ లోని ఒక కర్మాగారంలో వీటిని తయారు చేస్తారు. రాత్రి సమయాలలో విద్యుత్ వెలుగులలో మైసూరు పాలస్ ఒక కను విందు.
Photo Courtesy: Kiranravikumar

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
హంపి
హంపి కర్ణాటకలో ఒక టూరిస్ట్ ప్రదేశం. అక్కడి పండుగలకు ప్రసిద్ధి. అక్కడ జరిగే వార్షిక పండుగలకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి ప్రజలు వస్తారు. దీనిని హంపి ఉత్సవం అంటారు. ఈ సమయంలో పప్పెట్ షో లు, డాన్స్ లు, మ్యూజిక్, ఫైర్ వర్క్స్ వంటివి వేడుకలుగా చేస్తారు.

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
దండెలి
సాహసికులకు దండెలి ఒక స్వర్గం. దండెలి ఉత్తర కన్నడ జిల్లా లో ఒక చిన్న పట్టణం. ఇక్కడ వాటర్ రాఫ్టింగ్, రాపెల్లింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, జంగల్ సఫారి, కయాకింగ్, కేనోయింగ్, మూన్ లైట్ బోటు రైడ్, ఫిషింగ్ వంటివి ఆనందించవచ్చు.

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
చెన్నపట్న బొమ్మలు
చెన్నపట్న బెంగుళూరు సిటీ కి 60 కి. మీ. ల దూరం. ఈ పట్టణం అక్కడ తయారయ్యే కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ఈ వ్రుత్తి ని ప్రపంచ ట్రేడ్ సంస్థ కూడా గుర్తించినది. ఈ కళ టిప్పు సుల్తాన్ కాలంలో మొదలు పెట్టారు. పూర్వం గంధపు చెక్కతో బొమ్మలు చేసే వారు. కాని ఇపుడు మామూలు చెక్కను, ఇతర వస్తువులను వీటి తయారీలో వినియోగిస్తున్నారు. Photo Courtesy: HPNadig

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
మంగళూరు వంటకాలు
మంగళూరు లో తయారు అయ్యే కొంకణి, కన్నడ, తులు వంటకాలు బహు రుచి. ఈ వంటల ప్రత్యేకత అంటే వీటిలో అధికంగా కొబ్బరి వాడతారు. ఈ డిష్ లలో కోరే రొట్టి, నీర్ దోష, పత్రోడే, దుక్రా మాస్ (పోర్క్ డిష్) మరియు ఖాళి ప్రసిద్ధి. కొబ్బరి పూల నుండి నాటు సారాయి తయారు చేస్తారు. Photo Courtesy: GracinhaMarco Abundo

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
హూలి పురాతన దేవాలయాలు
కర్నాటక లో ని బెల్గాం జిల్లాలో హూలి ఒక చిన్న గ్రామం. ఈ విలేజ్ లో పదవ శతాబ్దం నాటి టెంపుల్స్ , నేడు శిదిలమైనవి, కలవు. ఇక్కడ కల పంచలింగేశ్వర టెంపుల్ ను పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. ఎంత శిదిలమైనప్పటికి ఈ టెంపుల్స్ నేటికీ చూడదగినవి.

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
హోగేనక్కల్ ఫాల్స్
హోగేనక్కల్ వాటర్ ఫాల్స్ , ' నయాగరా ఫాల్స్ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. ఈ జలపాతాలు, ధర్మపురి జిల్లాలో కలవు. సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా వుండే ఈ ప్రదేశం కర్ణాటకలో ఒక మంచి పర్యాటక ప్రదేశం.
Photo Courtesy: Balajimcat25/sandbox

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
ఇండియా లో బెస్ట్ పర్యాటక ప్రదేశం - కూర్గ్
ఇటీవలి పర్యాటక గణాంకాల మేరకు కూర్గ్ ఇండియా లో ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం గా తేలింది. గతంలో మున్నార్ ఉత్తమ ప్రదేశం కాగా, నేడు అధిక సంఖ్యా పర్యాట కత ఆధారంగా కూర్గ్ ఉత్తమ పర్యాటక ప్రదేశంగా గుర్తించబడినది. Photo Courtesy: Challiyan

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
యక్షగాన
కర్నాటక రాష్ట్ర సాంప్రదాయక నృత్యం ఇది. దీనిలో మ్యూజిక్, మరియు డైలాగ్ లు వుంటాయి. వ్యవసాయ ఆధారిత కర్ణాటకలో వర్ష రుతువు సంస్కృతిగా దీనిని ప్రదర్శిస్తారు. Photo Courtesy: Vaibhav Mehta

మైసూరు సిల్క్ మరియు శాండల్ వుడ్
రేడియో నిపుణుడు డా. ఎం వి గోపాలస్వామి
ఈ విషయం మీకు తెలుసా ? నేడు మనం వినే ఆకాశవాణి లేదా అల్ ఇండియా రేడియో పుట్టింది మైసూరు లో. దీని వ్యవస్థాపకుడు డా. ఎం.వి. గోపాలస్వామి. ఈయన కర్నాటక రాష్ట్రానికి రత్నం వంటి వాడు.



Click it and Unblock the Notifications














