బెంగళూరు-మంగళూరు వందే భారత్ రైలు పట్టాలెక్కడానికి మరో అడుగు ముందుకు వేసింది. సెప్టెంబర్ 10న ఈ రూట్లో రెండో సారి పూర్తిస్థాయి టైమింగ్ ట్రయల్ రన్ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. పశ్చిమ కనుమల (వెస్ట్రన్ ఘాట్) పరిధిలోని ఈ మార్గంలో ప్రయాణ సమయం, భద్రతా ప్రమాణాలను నైరుతి రైల్వే (SWR) బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. సెప్టెంబర్ 11 నాటికి అందిన సమాచారం ప్రకారం.. అధికారిక టైమ్టేబుల్, టికెట్ బుకింగ్స్ ప్రారంభంపై రైల్వే బోర్డు, SWR నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. సర్వీస్ ప్రారంభం కానున్నా, ప్రయాణికులకు టికెట్ల విక్రయాలు ఇంకా మొదలుకాలేదు.
ఈ రెండో ట్రయల్ రన్ నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. కాగా, సెప్టెంబర్ 5న జరిగిన తొలి ట్రయల్ రన్ బలమైన ఈదురుగాలులు, OHE-ప్యాంటోగ్రాఫ్ సాంకేతిక సమస్యల వల్ల కాస్త ఆలస్యమైంది. ఇక ఈ ప్రయోగంలో భాగంగా కబక పుత్తూరులో రైలును కాసేపు నిలిపారు. ఈ స్టాపేజ్ను శాశ్వతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ట్రయల్ రన్ పూర్తిచేసుకున్న ఈ రైలు యశ్వంతపూర్, హాసన్, సక్లేష్పూర్, సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం వేళకు మంగళూరు సెంట్రల్ చేరుకుంది.

బెంగళూరు-మంగళూరు వందే భారత్ షెడ్యూల్, స్టాపేజ్ల వివరాలు
ఈ రైలుకు యశ్వంతపూర్, హాసన్, సక్లేష్పూర్, సుబ్రహ్మణ్య రోడ్, మంగళూరు టెర్మినల్లలో ఆపరేషనల్ స్టాపేజీలు ఉండే అవకాశం ఉంది. ట్రయల్ రన్ నిలుపుదల తర్వాత కబక పుత్తూరు స్టాపేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. సాధారణంగా చాలా వందే భారత్ రైళ్లు వారానికి ఆరు రోజులు నడుస్తూ, ఒక రోజు మెయింటెనెన్స్ కోసం కేటాయిస్తాయి. రైల్వే బోర్డు ఆమోదం, రైలు మార్గాల (ట్రైన్ పాత్స్) లభ్యతను బట్టి తుది స్టాపేజీలు, సర్వీస్ రోజులు ఖరారవుతాయి.
బెంగళూరు-మంగళూరు వందే భారత్ టైమింగ్స్, బుకింగ్స్
సెప్టెంబర్ 5 నాటి ట్రయల్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు 8 గంటల సమయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ రూట్లో అత్యంత వేగవంతమైన 16511 KSR బెంగళూరు-కన్నూర్ ఎక్స్ప్రెస్ మంగళూరు సెంట్రల్ చేరుకోవడానికి 9 గంటల 23 నిమిషాలు పడుతోంది. వందే భారత్ గనుక 8 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తే, ప్రయాణికులకు దాదాపు 80 నిమిషాల సమయం ఆదా అవుతుంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిధిలోనే టికెట్ విక్రయాలు ప్రారంభమవుతాయి.
బెంగళూరు-మంగళూరు ప్రయాణంపై ప్రభావం.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు
ఈ రైలు ఉదయాన్నే బయలుదేరి, తిరిగి రాత్రికి చేరుకునేలా ఉంటే వీకెండ్ ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు వారానికి ఆరు రోజులు నడిచే యశ్వంతపూర్-కాచిగూడ వందే భారత్ ద్వారా బెంగళూరు చేరుకుని కనెక్ట్ కావచ్చు. అలాగే వైజాగ్ ప్రయాణికులకు చాలా రోజుల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ అందుబాటులో ఉంది. ఇక వందే భారత్ 2.0 కోచ్లు తక్కువ శబ్దంతో, మెరుగైన సీట్లు, అత్యాధునిక సౌకర్యాలతో హాయిగా ప్రయాణించే అనుభూతిని అందిస్తాయి.
బెంగళూరు-మంగళూరు వందే భారత్ బుకింగ్ టిప్స్, టికెట్ ధరలు
నైరుతి రైల్వే (SWR) టైమ్టేబుల్ విడుదల చేసిన వెంటనే యశ్వంతపూర్-మంగళూరు రూట్ కోసం IRCTC అలర్ట్స్ను సెట్ చేసి ఉంచుకోవడం మంచిది. సాధారణంగా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే 60 రోజుల వ్యవధిలో ఈ కొత్త సర్వీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. వందే భారత్ నిబంధనల ప్రకారమే ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. ఛైర్ కార్లో ప్రయాణికుడికి కిలోమీటరుకు సుమారు ₹2.19 చొప్పున ఛార్జ్ చేయవచ్చు. మిగతా రూట్ల తరహాలోనే పెయిడ్ మీల్స్, ఈ-కేటరింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
వందే భారత్ అందుబాటులోకి వచ్చే వరకు, రైలు ప్రయాణానికి అత్యంత వేగవంతమైన మార్గం 16511 నైట్ ఎక్స్ప్రెస్ను ఎంచుకోవడమే. సాధారణ వాతావరణం ఉన్నప్పుడు శిరాడి ఘాట్ ద్వారా వెళ్లే కేఎస్ఆర్టీసీ ప్రీమియం బస్సులు 7 నుంచి 8 గంటల సమయం తీసుకుంటాయి. అయితే వర్షాల సమయంలో కాస్త ఎక్కువ సమయాన్ని లెక్కలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సక్లేష్పూర్-సుబ్రహ్మణ్య ఘాట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాబట్టి ప్రయాణానికి కొంత అదనపు సమయాన్ని కేటాయించుకోవడం, లేటెస్ట్ ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవడం మంచిది. బయలుదేరే ముందు NH-75, ఘాట్ రోడ్డు లైవ్ ట్రాఫిక్ సూచనలను ఒకసారి సరిచూసుకోండి.



Click it and Unblock the Notifications











