భారత దేశంలో దేవుళ్లను ఎంతగా నమ్ముతారో దెయ్యలను అంతకంటే ఎక్కువగానే నమ్ముతారు. తమకు ఏదేని కష్టం వస్తే ఏ డాకినో, లేక ఏ మోహిని అనో భావిస్తారు. వాటికి వెంటనే శాంతి చేయించాలని భావిస్తారు. మరికొంతమంది తమ శత్రువలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదుగుదలను అడ్డుకోవడానికి పిశాచాలను వశపరుచుకే వారి దగ్గరకు వెళ్లి తమ కోరిక నెరవేరాలని వేడుకుంటుంటారు. భారత దేశం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా ఇప్పటికీ భూత, ప్రేతాలకు పూజలు చేసే ప్రాంతాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో సాంకేతిక రాజధానిగా చెప్పుకునే హైదరాబాద్ కూడా ఉంటడం గమనార్హం. ఈ భాగ్యనగరంతో పాటు ఈ మంత్ర, తంత్రాలకు పేరు గాంచిన దేశంలోని ఇతర ప్రాంతాల వివరాలతో కూడిన కథనం..
1. కర్ణాటకలోని కొల్లేగాల
Image source
కర్ణాకట రాష్ట్రంలో చామరాజ నగర జిల్లాల్లో కొల్లేగాల ఉంది. ఇక్కడ చేతబడి, బానమతి వంటి వాటిని చేయించడానికి లేదా విడిపించడానికి భారత దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు.
2.కేరళ
Image source
100 శాతం అక్షరాస్యంత సాధించి ప్రపంచ ద`ష్టిని ఆకర్షించిన రాష్ట్రం కేరళ. అయితే ఇక్కడ ఇప్పటికీ మూడ నమ్మకాలు ఎక్కువే. ఇక కేరళలో చాలా ప్రాంతాల్లో మంత్ర, తంత్రాలు జరుపుతారు.
3. త్రిషోర్
Image source
అయితే త్రిషోర్ ఈ విషయంలో దేశంలో ప్రఖ్యాత గాంచింది. ఇక్కడ విష్ణుమూర్తిని కుట్టి చేతన్ అని పిలుస్తారు. ఈ కుట్టి చేతన్ సమక్షంలోనే మంత్ర, తంత్ర విద్యల అభ్యాసం చేసి కష్టమని వచ్చిన వారి సాంతన చేకూర్చే ప్రయత్నం జరుగుతోంది.
4. హైదరాబాద్
Image source
బెంగళూరు తర్వాత హైదరాబద్ ను ఐటీ హబ్ గా పిలుస్తారు. అయితే ఇదే నగరంలో చేతబడులు కూడా ఎక్కువగానే జరుగాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రయోజనం శూన్యం.
5.సుల్తాన్ షాహీ
Image source
హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఈ బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నా సుల్తాన్ షాహీ ప్రాంతం ఇందుకు చాలా ప్రఖ్యాతి గాంచింది. దేశంలో చాలా చోట్ల నుంచి ఇక్కడకు ఈ మంత్ర, తంత్రాలను నమ్మేవారు వస్తుంటారు.
6.వారణాసి
Image source
వారణాసిని భారత దేశపు ధార్మిక నగరంగా పిలుస్తారు. ఇక్కడ దైవ స్మరణ ఎంత బాగా జరుగుతుందో అదే విధంగా దెయ్యాలు, భూతాల గురించిన చర్చ కూడా అంతే జోరుగా జరుగుతుంది.
7.స్మశానవాటికలో
Image source
దేశంలోనే అతి పెద్ద స్మశానవాటిక వారణాసిలోనే కలదు. ఇక్కడి స్మశానవాటికలో నాగసాధువులు తాంత్రిక పూజలు చేస్తుంటారు. విదేశాల నుంచి కూడా కొంతమంది ఇక్కడకు వచ్చి ఈ విద్యలను నేర్చుకుంటున్నారు.
8.కొలకత్తా
Image source
సాహితీ రాజధానిగా పేరుగాంచిన కొలకత్తాలో తాంత్రిక పూజలకు కొదువు లేదు. ఇక్కడకు వలస ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. వారి అజ్జానాన్ని ఆసరగా చేసుకుని ఈ పూజలు నిర్వహించేవారు ఇక్కడ ఎక్కువ
9.నిమ్తాల ఘాట్
Image source
కొలకత్తాలో చాలా చోట్ల ఈ పూజలు జరిగినా నిమ్తాలా ఘాట్ అనే స్మశానవాటికలో రాత్రి సమయంలో తాంత్రిక విద్యల పూజలు జరుగుతాయి. ఆ సమయంలో అటువైపు ఎవరూ వెళ్లరు.
10 అస్సాంలోని మయాంగ్
Image source
అస్సాంలోని మయాంగ్ అటవీ, కొండ కోనల ప్రాంతంతో కూడుకున్నది. ఈ గ్రామం తాంత్రిక విద్యలకు ప్రపంచంలోనే పేరుగాంచింది. ఇక్కడకు వెళ్లడానికి సాధారణ ప్రజలు సాహసించరు.
11.కుషభద్ర నదీతీరం
Image source
ఒడిస్సాలోని కుషభద్ర నదీ తీరంలో ఈ నాగసాధువులు ఎక్కువగా తాంత్రిక విద్యలను చేస్తుంటారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు.
12. సంభోగం కూడా
Image source
ఈ నాగసాధువులు పూజల్లో భాగంగా మహిళలతో పాటు శవాలతో కూడా సంభోగిస్తుంటారని చెబుతుంటారు. మానవుడి పచ్చిమాంసాన్ని కూడా తింటారు.
13.మహిళలు
Image source
సాధారణంగా పురుషులు మాత్రమే ఈ మంత్ర, తంత్రాలను చేస్తుంటారు. అయితే హైదరాబాద్, కొలకత్తా వంటి చోట్ల ఈ విద్యను అభ్యసించిన మహిళలు కూడా ఉన్నారు.
14. మహిళల పై మహిళలే
Image source
కష్టమంటూ తమ వద్దకు వచ్చే మహిళలను ఈ విద్య తెలిసన మహిళలు లోబరుచుకుని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.