ఇండియా లోని తమిళ్ నాడు రాష్ట్రంలో ధర్మపురి పట్టణం కలదు. ఈ ప్రదేశం పొరుగునే కల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు సమీపంగా వుంటుంది. ధర్మపురి దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. బెంగుళూరు మరియు చెన్నైల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాదేశానికి వస్తారు. ప్రాచీన కాలంలో ధర్మపురి చొళులు, రాష్ట్రకూటులు, పాండ్యులు చే ఈ ప్రదేశం పరిపాలించబడింది.
Image source: commons.wikimedia.org

హోగేనక్కల్ ఫాల్స్
పేరు గాంచిన హోగేనక్కల్ ఫాల్స్ తమిళ్ నాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో కలవు. ఈ ప్రదేశం ధర్మపురి కి 46 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులు విశ్రమించి ప్రశాంత, నీటి పరిసరాలను ఆనందించేందుకు అనుకూలంగా వుంటుంది.

డాం మరియు పిక్నిక్ ప్రదేశం
ధర్మపురి లో మరొక అందమైన ప్రదేశం క్రిష్ణగిరి డాం. ఇది కృష్ణగిరి మరియు ధర్మపురిల మధ్య కలదు. స్థానికులకు ఇది ఒక వారాంతపు విహార ప్రదేశం.

టెంపుల్స్ అండ్ చర్చి లు
కొట్టాయి కోవిల్, చెన్నరాయ పేరుమల్ టెంపుల్ మరియుతీర్థ మలైలో కల శ్రీ తీర్థ గిరిస్వరార్ టెంపుల్ వంటివి ఇక్కడి ఆకర్షణలు. ఇంకనూ ఇక్కడ మౌంట్ కార్మెల్ చర్చి, సి.ఎస్.ఐ జిఒన్ చర్చి, సచ్రెద్ హార్ట్ కేథడ్రాల్ మరియు మెట్టూర్ డాం లు మరికొన్ని ఆకర్షణలు.

పురాతన కోట
ఇక్కడ ఒక కోట శిధిల అవశేషాలు వుంటాయి. ఈ కోట కోడి గుడ్డు ఆకారంలో వుంటుంది.అధియామన్ కొట్టాయి ప్రదేశం ధర్మపురి నుండి 7 కి.మీ. ల దూరంలో కలదు.

ఎలా చేరాలి ?
ధర్మపురికి తమిళ్ నాడులోని వివిధ ప్రదేశాలతో రోడ్డు మరియు రైల్ మార్గాలు కలవు. డీలక్స్, సెమి డీలక్స్, ఏ.సి మరియు నాన్ ఏ సి బస్సులు ధర్మపురి నుండి సమీప ప్రధాన నగరాలకు కలవు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ధర్మపురికి సమీపంగా వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ లో దేశీయ మరియు విదేశీ విమానాలు నడుస్తాయి.



Click it and Unblock the Notifications













