మీరు కన్నడనాట అడుగుపెడితే ఈ ప్రదేశాలను మిస్వవ్వొద్దు!
కర్ణాటక రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, తీరప్రాంతాలకు, వన్యప్రాణులతోపాటు అద్భుతమైన సాహస గమ్యస్థానాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఏటా ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు ఇక్కడ సందడి చేస్తుంటారు. రాష్ట్రంలో చాలా ఆసక్తికరమైన సందర్శనీయమైన ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీ ప్రయాణపు జాబితాలో కర్ణాటక ఉంటే మాత్రం మీరు తప్పక చూడాల్సిన కొన్ని పర్యాటక ప్రదేశాలను ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం.

యానా గుహలు
యానా గ్రామం ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి మరియు కుమటా పట్టణాలు పంచుకున్న అడవులలో ఉంది. ఈ గ్రామం కార్ట్స్ లైమ్స్టోన్తో నిర్మితమై రెండు ప్రత్యేకమైన రాతి గుహలకు ప్రసిద్ధి చెందింది. వీటిని యానా గుహలుగా పిలుస్తారు. ఈ రెండు శిలలు - భైరవేశ్వర శిఖర మరియు మోహిని శిఖర హిందూ దేవుడైన శివ భక్తులకు ముఖ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి. భైరవేశ్వర శిఖరం పాదాల వద్ద ఉన్న గుహ దేవాలయంగా గుర్తించబడి, ఒక ముఖ్యమైన ప్రార్థనా స్థలంగా పేరుగాంచింది.

చెన్నపట్నం
రామనగర జిల్లా చెన్నపట్నం గ్రామం. మీరు సావనీర్ సేకరణకు ఇష్టపడినవారైతే ఈ గ్రామాన్ని తప్పకుండా సందర్శించాలి. స్థానికంగా దీనిని గొంబెగల నగారా లేదా బొమ్మల భూమి అని పిలుస్తారు. ఇక్కడ వారు ప్రసిద్ధ చెన్నపట్న బొమ్మలను తయారు చేస్తారు. చన్నపట్న గ్రామానికి చెందిన బొమ్మల తయారీదారులు తరతరాలుగా బొమ్మల తయారీలో కొన్ని పద్ధతులను పాటిస్తున్నారు. నిర్దిష్ట శైలి నుండి రంగులు, ఉపయోగించే పదార్థాల వరకు ఈ బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. విభిన్న కళాకృతులను ఇష్టపడేవారు చెన్నపట్నంలో అడుగుపెట్టాల్సిందే.

కరిఘట్ట నల్ల కొండ
కరిఘట్ట కొండ బెంగళూరు నుండి కేవలం 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేసవి కాలంలో కొండ చుట్టూ ఉండే గడ్డి ఎండిపోయి కొండ చాలా చీకటిగా కనిపిస్తుంది. కాబట్టి దీనిని నల్లటి కొండ అని పిలుస్తారు. కరిఘట్ట కొండపై ఆలయ సముదాయం ఉంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రదేశానికి సుదూర ప్రాంతాలనుంచి సందర్శకులు వస్తూ ఉంటారు. స్థానికంగా కూడా ఈ కొండ ప్రాంతం ఎంతో ప్రసిద్ధిగాంచిందనే చెప్పాలి. అందుకే ప్రజలు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.

సహస్ర లింగం
కర్ణాటకలో మీరు అడుగుపెట్టాల్సిన అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో బహుశా ఇది ఒకటి. సహస్ర లింగం సిరిసి తాలూకా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం. శామల నది ఒడ్డున రాళ్లపై చెక్కిన లింగాలు మరియు బసవులు (ఎద్దులు) అనేకం ఉన్నాయి. ఇవి వెయ్యికిపైగా ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ లింగాలు సిరిసి రాజ్య రాజు సదాశివరాయవర్మ ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు ఈ ప్రదేశం సరైన ఎంపికగా చెప్పొచ్చు.

మురుడేశ్వర దేవాలయం
ఇది చాలా జనాదరణ పొందిన దేవాలయం. అంతటి విశిష్టమైనది కాబట్టే మన జాబితాలో చేరుకుంది. మురుడేశ్వర దేవాలయం ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర బీచ్ సమీపంలో ఉంది. దేశంలోనే ఎత్తైన గోపురం ఈ ఆలయంలోనే కనిపిస్తుంది. మురుడేశ్వర బీచ్ ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహానికి నిలయం. తీర ప్రాంతపు అందాలను ఆస్వాదిస్తూ.. ఆధ్యాత్మిక పరవశంలో మునిగేందుకు మురుడేశ్వర దేవాలయంలో అడుగుపెట్టాల్సిందే.



Click it and Unblock the Notifications














