చారిత్రక ప్రాధాన్యతకల శ్రీరంగపట్నం తప్పక చూడవలసిన ప్రదేశం. శ్రీరంగపట్నం ఒక ద్వీపం. కావేరి నదికిగల రెండు పాయల మధ్య ఉంది. ఈ ద్వీపం మైసూర్ కు సమీపంలో ఉంది. షుమారు 13 చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంటుంది.
చారిత్రక ప్రాధాన్యం - శ్రీరంగపట్నం దాని చారిత్రక ప్రాధాన్యతల కారణంగా అది ఒక పర్యాటక కేంద్రంగా విశిష్టతను సంతరించుకొంది. ఈ పట్టణానికి ఆ పేరు అక్కడగల అందమైన రంగనాధస్వామి దేవాలయం వలన కలిగింది. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటినుండి అది అనేక ఆటుపోట్లకు గురయింది. దాని కారణంగానే, నేడు అది హొయసల మరియు విజయనగర శిల్ప కళల సంకలనానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
టిప్పు సుల్తాన్ పాలనలో మైసూర్ పట్టణానికి దీనిని రాజధానిని చేయటం వలన కూడా కొంత ప్రాముఖ్యత ఇది సంతరించుకొంది. ఈ కారణంగా ఈ పట్టణ శిల్ప సంపదలో కొంత ముస్లిం కళా శైలి కూడా గోచరిస్తుంది. దరియా దౌలత్ బాగ్ మరియు జామా మసీద్ వంటి కట్టడాలు వారి కాలంలో నిర్మించబడినవే.
శ్రీరంగ పట్న పరిధిలోని సహజ ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఈ ప్రాంతంలోని శివన సముద్ర జలపాతాలు గొప్ప విహార స్ధలంగా పేరు పడ్డాయి. ఇవి రెండవ అతిపెద్ద జలపాతాలుగా చెప్పబడతాయి. శ్రీరంగ పట్టణం వద్ద గల సంగమ ప్రదేశంలో కావేరి, కాబిని మరియు హేమవతి నదులు ఒక్కచోట కలుస్తాయి. పర్యాటకులకు ఇది ఒక విశేష ప్రదేశం.
శ్రీరంగపట్నం బెంగుళూరుకు 127 కి.మీ.లు, మైసూర్ పట్టణానికి 19 కి.మీ.ల దూరంలోను ఉంది. ఇక్కడ ఒక రైలు స్టేషన్ కూడా కలదు. సమీప విమానాశ్రయం మైసూర్ లో కలదు. బెంగుళూరు - మైసూర్ జాతీయ రహదారిలో ఉండటం చేత, బస్ సౌకర్యాలు అధికంగానే ఉన్నాయి.



Click it and Unblock the Notifications