రాజస్థాన్లోని పర్యాటక అందాలకు ప్రపంచంలోనే సాటి లేదనడంలో సందేహమే లేదు. ఇక్కడి ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలు నిత్యం సందర్శకులను ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఎటు చూసినా చారిత్రక నేపథ్యం ఉన్న కోటలు, రాజభవనాలు హుందాగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏటా వీటిని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. అయితే, పొడవాటి గోడలతో శత్రుదుర్భేక్షంగా తారసపడే కుంభాల్గర్ కోట వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఈ కోట చారిత్రక నేపథ్యంతోపాటు దీని నిర్మాణ శైలి గురించి తెలుసుకుందాం.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ప్రత్యేక సంప్రదాయాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలో అనేక కోటలు, రాజభవనాలు కూడా ఉన్నాయి. ఇవి రాజస్థాన్ కీర్తిని మరింత పెంచుతాయనడం అతిసయోక్తి కాదు. వీటిలో కుంభాల్ఘర్ కోట ఒకటి. దీని అందాన్ని ఆస్వాదించడానికి పర్యాటక ప్రేమికులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. ఈ కోట ఎంత అద్భుతంగా ఉంటుందో, దాని వెనుక దాగిన చరిత్ర కూడా అంతే అద్భుతమైంది.

కుంభాల్ఘర్ కోట చరిత్ర
కుంభాల్ఘర్ కోట దీని భారీ గోడలతో ప్రసిద్ధికెక్కింది. 36 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దీని గోడలు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ పొడవైన గోడగా పరిగణించబడుతోంది. అందుకే ఈ కోట గోడను లాంగ్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలో ఉన్న ఈ అద్భుతమైన కోట ఆరావళి పర్వతాల పశ్చిమ శ్రేణిలో ఉదయపూర్ నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట 15వ శతాబ్దంలో మేవార్ ప్రాంత పాలకుడు రాణా కుంభచే నిర్మించబడింది.
శత్రు దుర్భేద్యమైన కోటలలో ఒకటి
కుంభాల్ఘర్ కోట బలమైన రక్షణ ప్రాతిపధికన నిర్మించడంతో భారతదేశంలోని అత్యంత శత్రు దుర్భేద్యమైన కోటలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ కోటను మేవార్ కోట అని కూడా అంటారు. ఈ ప్రదేశం రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్ జన్మస్థలం. ఈ కోటలో తారసపడే ప్రతి నిర్మాణం శత్రువుల నుండి రక్షించడానికి తయారు చేయబడ్డాయి. ఈ కోటలో ఉన్న ఏడు ద్వారాలు, 13 పర్వత శిఖరాలు, అనేక వాచ్ టవర్లు లోపలకు ప్రవేశించేందుకు శత్రువులకు సవాలుగా నిలుస్తాయి. ఇది నిర్మితమైన తర్వాత కోటను ఒక్కసారి మాత్రమే ముట్టడించినట్లు కొన్ని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.

కోటలో ఠీవిగా కనిపించే ఏడు ద్వారాలు
ఈ భారీ కోటలోకి ప్రవేశించడానికి ఏడు కోట గేట్వేలు నిర్మించబడ్డాయి. ఈ ఏడు తలుపుల పేర్లు అరెట్ పోల్, హనుమాన్ పోల్, రామ్ పోల్, విజయ్ పోల్, నింబు పోల్, పగ్రా పోల్ మరియు టాప్ ఖానా పోల్. ఇవి కాకుండా మీరు దాని లోపల బాదల్ మహల్ కూడా చూడవచ్చు. ఈ ప్యాలెస్ కోట యొక్క ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుండి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలతోపాటు ఆకాశాన్ని తాకేలా కనిపించే మేఘాల అందమైన దృశ్యం కనిపిస్తుంది. అందుకే దీనిని బాదల్ మహల్ అని పిలుస్తారు. అలాగే, ఈ కోట ప్రాంగణంలో 360 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయం.
UNESCO గుర్తింపు..
కోట యొక్క విశేషాలు మరియు అద్భుతమైన చరిత్ర కారణంగా కుంభాల్ఘర్ కోట UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. రాజస్థాన్లోని కొండపైన కోటలలో భాగమైన ఈ కుంభాల్ఘర్ కోట 2013లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేయబడింది. నేటికీ, ఈ కోట వైభవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. సాయంత్రం పూట ఈ కోటను సందర్శించే పర్యాటకులు అద్భుతమైన లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదించవచ్చు. ఇందులో కోటకు సంబంధించిన చరిత్రను కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు.



Click it and Unblock the Notifications













