Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని ఈ రైల్వేస్టేష‌న్ల‌లో.. మ‌హిళ‌లు మాత్ర‌మే ఉద్యోగులు

దేశంలోని ఈ రైల్వేస్టేష‌న్ల‌లో.. మ‌హిళ‌లు మాత్ర‌మే ఉద్యోగులు

దేశంలోని ఈ రైల్వేస్టేష‌న్ల‌లో.. మ‌హిళ‌లు మాత్ర‌మే ఉద్యోగులు

ఇప్పుడు మ‌న దేశంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో త‌మ స‌త్తా చాటుతున్నారు. గాల్లో విమానం మొద‌లుకుని నీటిపై పెద్ద పెద్ద ఓడ‌ల‌ను సైతం అవ‌లీల‌గా నడిపేస్తున్నారు. అయితే, కొన్ని ప్ర‌దేశాలు కేవ‌లం మ‌హిళ‌ల‌తో మాత్ర‌మే కొన‌సాగిస్తూ పేరు పొందుతాయి. ఇప్ప‌డు మ‌నం చెప్పుకోబోయేది అలాంటి ప్ర‌దేశాల గురించే.. అవే కేవ‌లం మ‌హిళ‌ల‌తో మాత్ర‌మే నిర్వ‌హించ‌బ‌డుతోన్న రైల్వేస్టేష‌న్లు. మ‌న‌దేశంలో ఇలా మ‌హిళ‌ల‌తో నిర్వ‌హిస్తోన్న రైల్వేస్టేష‌న్లు ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నాయి. ఆ రైల్వేస్టేష‌న్లు ఎక్క‌డున్నాయి? వాటి ప్ర‌త్యేక‌త‌లేంటి తెలుసుకుందాం రండి..

అజ్ని రైల్వే స్టేషన్

నాగ్‌పూర్‌లోని ఈ రైల్వే స్టేషన్ మహారాష్ట్రలో రెండవది, దేశంలో మూడవది. దీనిని మహిళలు మాత్రమే నడుపుతున్నారు. ఇది సెంట్రల్ రైల్వేలోని నాగ్‌పూర్ విభాగంలో కూడా ఒక భాగం. ఈ స్టేషన్‌లో రోజుకు ఆరు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక్కడ 22 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ భవనంలో 21 లిఫ్టులు, 17 ఎస్కలేటర్లు, 6 ట్రావెలేటర్లు ఉంటాయి. స్టేషన్ మొత్తం డిసేబుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టేష‌న్‌లో మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.

గాంధీ నగర్ రైల్వే స్టేషన్

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న గాంధీ నగర్ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళలచే నిర్వహించబడుతుంది. దేశంలో మహిళలు మాత్రమే నిర్వహించే తొలి స్టేషన్ ఇదే. ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ చెకర్ వరకు ప్రతి ఉద్యోగి మహిళలే కావ‌డం విశేషం. దేశంలోని మొట్టమొదటి నాన్-సబర్బన్ స్టేషన్‌గా ఇది అవతరించింది. ఈ స్టేషన్ నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) జైపూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

1

మాతుంగా రైల్వే స్టేషన్

ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ కేవలం మహిళా ఉద్యోగులు మాత్ర‌మే ఉండే స్టేష‌న్‌. మాతుంగా రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వస్తుంది. ఇక్క‌డ కేవ‌లం మ‌హిళ ఉద్యోగులు మాత్ర‌మే ఉంటారు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2018లో కూడా నమోదు చేయబడింది. మాతుంగా రైల్వే స్టేషన్ ప‌శ్చిమ రైల్వేలోని మాతుంగా రోడ్ స్టేషన్ పొరుగు స్టేషన్ 1993, 2006లో తీవ్రవాద బాంబు దాడులను ఎదుర్కొంది. ఏ సహోద్యోగి లేదా యజమాని జోక్యం లేకుండా మహిళలు తమ స్వంత ఇష్టానుసారం అన్ని నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునే వాతావరణాన్ని ఈ స్టేషన్ సృష్టిస్తుంది.

2

మణినగర్ రైల్వే స్టేషన్

అహ్మదాబాద్‌లోని మణినగర్ రైల్వేస్టేష‌న్‌ దేశంలో నాల్గవ స్టేషన్. ఇక్కడ మహిళా ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ రైల్వే పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్‌లో మొత్తం 23 మంది క్లర్కులు, ఒక‌ స్టేషన్ మాస్టర్, ఇద్ద‌రు పాయింట్ పర్సన్‌లు ఉన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన ప‌ది మంది మహిళా సైనికులు కూడా ఉన్నారు.

3

చంద్రగిరి రైల్వే స్టేషన్

ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ సెక్షన్‌లో ఉంది. దేశంలో కేవలం మహిళలే నిర్వహించే ఐద‌వ స్టేషన్ ఇది. ఈ రైల్వేస్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్‌ నుంచి పోలీసు సిబ్బంది వరకు ఉద్యోగులంతా మహిళలే.

More News

Read more about: india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+