అజ్మీర్ రాజస్థాన్లో ప్రసిద్ధ చెందిన ప్రదేశం. ఇది జైపూర్కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అజ్మీర్ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన ఇస్లాం మత క్షేత్రం. దీని చుట్టూ ఆరావళి పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని "ఆరావళి పర్వత శ్రేణులలో ఆణిముత్యం" అని కూడా పిలుస్తుంటారు. ఆరావళి పర్వతాలు భారతదేశంలో అతిపురాతన ముడత పర్వతాలు.
ఆరావళి కొండల్లో నెలకొని ఉన్న అజ్మీర్ను 7వ శతాబ్దం ADలో రాజా అజయ్పాల్ చౌహాన్ స్థాపించారు. 1193 CEలో పృథ్వీరాజ్ చౌహాన్ మహ్మద్ ఘోరీ చేతిలో అజ్మీర్ను కోల్పోయారు. ఆ తర్వాత నుంచి 12వ శతాబ్దం వరకు ఇది చౌహాన్ రాజ్పుత్ల బలమైన కోటగా విరాజిల్లింది. అనంతరం అక్బర్ దీనిని 1556 ADలో మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా స్వాధీనం చేసుకున్నాడు. ఇది అప్పట్లో ఒక సైనిక స్థావరంగా ఉండేది. ఆ తర్వాత ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారింది. చాలా కాలం తరువాత మొఘల్లకు ఇది ఒక తీర్థయాత్రగా మారింది. మొఘలుల అనంతరం గ్వాలియర్ సింధియాలు అజ్మీర్లో అధికారాన్ని పొందారు.

ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు..
అజ్మీర్ ప్రసిద్ధ దర్గా షరీఫ్కు నిలయంగా ఉంది. ఇందులో గరీబ్ నవాజ్ సమాధి కూడా ఉంది. దీనిని సూఫీ మతం యొక్క చిస్తీ క్రమాన్ని స్థాపించిన మొయినుద్దీన్ చిష్తీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రతియేటా హిందూ, ముస్లింలు అనే తారతమ్యం లేకుండా పర్యాటకులు వస్తుంటారు. ఈ సమాధితో పాటు, ఈ చారిత్రక నగరం అద్భుతమైన కోటలు, మ్యూజియంలు, రాజభవనాలు, సరస్సులకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది.
అజ్మీర్ దేశంలోని మొట్టమొదటి పాఠశాలల్లో ఒకటైన ప్రఖ్యాత మాయో కళాశాలకు నిలయంగా ఉంది. ఇంకా ఇక్కడ సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో తారాఘర్ కోట, అక్బర్ ప్యాలెస్, మ్యూజియం, అధై దిన్ కా జోంప్రా, నసియాన్ టెంపుల్, నరేలి జైన్ టెంపుల్, కిషన్గఢ్ ఇతర ప్రసిద్ధ ప్రదేశాలు.

ఎలా చేరుకోవాలి...
ఈ ప్రాంతం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర పుష్కర్ నగరానికి అజ్మీర్ ప్రవేశ ద్వారం. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా సంగనేర్ విమానాశ్రయం అజ్మీర్ నుండి 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు నుండి విమానాల సర్వీసులు ఉన్నాయి. అజ్మీర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, జైపూర్, బెంగుళూరు, ఉదయపూర్, అహ్మదాబాద్, బికనీర్, హైదరాబాద్, హౌరా, జోధ్పూర్, ఆగ్రా, డెహ్రాడూన్, ఓఖా, చండీగఢ్, రాంచీ, కోల్కతా, వారణాసి, జైసల్మేర్, ముంబై, అమృత్సర్, హరిద్వార్, రైళ్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
పూణే, భోపాల్. అజ్మీర్ ఢిల్లీ, జైపూర్, జోధ్పూర్, ఆగ్రా, ఉదయపూర్, అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, బికనీర్లతో నేరుగా బస్సు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అజ్మీర్ ఢిల్లీకి సమీపంలో ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. ఇది జైపూర్ నుండి 132 కిలోమీటర్లు, ఢిల్లీ నుండి 390 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.



Click it and Unblock the Notifications












