దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ మార్చి 31వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో విహారయాత్రలకు ప్రణాళికలు వేసేవారు వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసేవారు తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. చారిత్రక వారసత్వాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ను సందర్శించాల్సిందే. మార్చి 31 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో పాల్గొని ఢిల్లీ చారిత్రక విషయాలను తెలుసుకోవచ్చు. దీనిని ఢిల్లీ ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహించింది. ఈ ఫెస్టివల్లో ఢిల్లీ అందాలను దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.
చారిత్రక కట్టడాలను వివరించేందుకు టూరిస్ట్ గైడ్...
నెల రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్లో ఢిల్లీ గొప్ప వారసత్వం, చారిత్రక కట్టడాలతో పాటు, ఇక్కడి విభిన్నరకాల వంటకాల రుచులను కూడా ఆస్వాదించొచ్చు. ఇక, ఈ ఢిల్లీ టూరిజం ఫెస్టివల్లో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన గైడ్లను కూడా కలుసుకునే అవకాశం లభిస్తుంది. వారు ఢిల్లీ యొక్క 50 విభిన్న వారసత్వం మరియు చారిత్రక అవశేషాల గురించి వివరిస్తారు. దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమయంలో ఢిల్లీని సందర్శిస్తారు.

మెహ్రౌలీ పురావస్తు పార్కు నుండి ఈ ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. దీనిని ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ కథ పాండవుల ఇంద్రప్రస్థ నుండి మొదలై, పృథ్వీరాజ్ చౌహాన్ కోట అయిన రాయ్ పిథోరాకు వస్తుందని తెలిపారు. తుగ్లక్ సామ్రాజ్యం కాలంలో తుగ్లకాబాద్ ఫిరోజాబాద్ అయింది.
ఇది షాజహానాబాద్ మొఘల్ కాలంలో నిర్మించబడింది. పురానా ఖిలా షేర్ షా సూరి కాలంలో నిర్మించడం జరిగింది. దీనిని పాండవుల కాలంలో పురాణ ఖిలా ఖాండవప్రస్థ అని కూడా చెబుతుంటారు. అప్పటి రాజధాని ఇంద్రప్రస్థగా ఉండేది. అనంతరం బ్రిటీష్ వారు మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చాక, వారు కొత్త లుటియన్స్ ఢిల్లీని స్థాపించారు, దీనిని మనం ఇప్పుడు న్యూ ఢిల్లీ అని పిలుస్తున్నాము. ఈ విభిన్న కాలాలలో, చాలావరకు ఢిల్లీ వివిధ ప్రజల సుల్తానుల క్రింద రాజధానిగా ఉండేది.
'ఢిల్లీ టూరిజం వాక్ 2024' ప్రత్యేకత ఏమిటి?
ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ 2024 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇక్కడ సుఫియానా ఢిల్లీ యొక్క క్లాసిక్ సంగీతాన్ని, మెహ్రౌలీలోని పురావస్తు పార్కును, షామ్-ఎ-తుగ్లక్బాద్లోని చరిత్రను వివరిస్తారు. అంతేకాదు, ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో కోట యొక్క అందాలను కనులారా వీక్షించే అవకాశం పర్యాటకులకు లభిస్తుంది. అదే సమయంలో, హాంటెడ్ వాక్లోని మల్చా మహల్ రహస్యం, ఫిరోజ్షా కోట్లాలోని జిన్ల మౌఖిక కథల వాస్తవికత కథలను కూడా తెలుసుకోవచ్చు.

వీటితోపాటు కుతుబ్ కాంప్లెక్స్లో దేఖో అప్నా సీపీ, రోషన్-ఎ-దిల్లీ మరియు ఢిల్లీకి చెందిన జ్యువెల్స్ వంటి ఫన్ వాక్లు కూడా ఉంటాయి. ఆహారప్రియులైతే మాత్రం ఇక్కడ 'జయకే పురాణీ డిల్లీ కే' అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అలాగే, ఇక్కడి పాత కోట అందాలను కూడా వీక్షించొచ్చు.
ఎలా బుక్ చేసుకోవాలి...
ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ 2024లో ప్రత్యేక ఆఫర్లతో బుకింగ్ రేటు ఒక్కొక్కరికి రూ.500గా నిర్ణయించడమైనది. ఈ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఢిల్లీ టూరిజం డిపార్ట్మెంట్ delhitourism.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా టిక్కెట్లు కొనేవారు ఢిల్లీ టూరిజం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఢిల్లీ టూరిజం వాక్ ఫెస్టివల్ పూర్తి షెడ్యూల్ని చూసేందుకు ఈ లింక్ని సందర్శించవచ్చు- https://delhitourism.gov.in/dttdc/explore_the_city/walk.jsp మరెందుకాలస్యం మీరు కూడా మీ ప్రయాణాన్ని మొదలెట్టండి మరీ...



Click it and Unblock the Notifications












