Search
  • Follow NativePlanet
Share
» »స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజ) హైదరాబాద్ విశేషాలు మీకోసం

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజ) హైదరాబాద్ విశేషాలు మీకోసం

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజ) హైదరాబాద్ విశేషాలు మీకోసం

ఈక్వాలిటీ హైదరాబాద్ అనేది హిందూ సంఘ సంస్కర్త రామానుజాచార్యుని 216 అడుగుల ఎత్తైన బంగారు విగ్రహం. ఇది ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల‌లో ఒక‌టిగా పేరుగాంచింది. ఈ విగ్రహాన్ని రామానుజ విగ్రహం అని కూడా అంటారు. ఇది రామానుజుల విశ్వాసాలను, భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి నిర్మించబడింది. ముకుళిత హస్తాలతో, ముఖంపై మృదువుగా చిరునవ్వుతో కూర్చున్న అతను శిల్పం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ శివార్లలో 45 ఎకరాల సుందరమైన జీయర్ ఇంటిగ్రేటెడ్ వేద అకాడమీ (జీవా)లో ఈ 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహం ఉంది. ఇది రామానుజాచార్యల‌ ప్రపంచ సమానత్వ సందేశాన్ని అందించడానికి స్థాపించబడింది. కులం, మతం, వర్ణం మరియు ఇతర వివక్ష లేని ప్రపంచాన్ని సృష్టించడమే ఆత‌ని సంక‌ల్పంగా చెప్ప‌బ‌డుతోంది.

statueofequality1

ఈ కళాఖండం అతని 1000వ జన్మదినోత్సవం సందర్భంగా అతని బోధనల జ్ఞాపకార్థం నిర్మించబడింది. రామానుజ విగ్రహం మూడంతస్తుల భవనంపై ఏర్పాటు చేయబడింది. ఇందులో వేద డిజిటల్ లైబ్రరీ, ధ్యాన మందిరం మరియు విద్యా గ్యాలరీ కోసం అంతస్తులు ఉన్నాయి. ఇది పురాతన భారతీయ గ్రంథాలు, రామానుజాచార్య రచనలను కలిగి ఉన్న మ్యూజియంను కూడా కలిగి ఉంది.

రామానుజాచార్యులు ఎవరు?

రామానుజాచార్యలు వేద తత్వవేత్త. అంతేకాదు, సంఘ సంస్కర్త కూడా. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 11వ శతాబ్దంలో జన్మించారు. అతను దేశమంతటా పర్యటించాడు. వివిధ ప్రాంతాలలో జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేశంలో భక్తి ఉద్యమాన్ని పునరుద్ధరించాడు. రామానుజుల విశిష్టాద్వైత తత్వశాస్త్రం అనేక ఇతర భక్తి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. అతని బోధనలు కబీర్, మీరా మరియు తులసీదాస్ వంటి కవులను కూడా ప్రేరేపించాయి.

statueofequality1

అతను భారతదేశం అంతటా దేవాలయాలలో నిర్వహించే ఆచారాలకు సరైన విధానాలను కూడా ఏర్పాటు చేశాడు. ఆధ్యాత్మిక నాయకుడుగా, దేవుడు తన సృష్టిని సృష్టించాడని విశ్వసించాడు. అతను ఆధ్యాత్మిక వృద్ధిని విశ్వసించాడు. సమాజంలో ప్రబలంగా ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు.

సాహిత్య మేధావి కూడా..

అతను తత్వవేత్త, సంస్కర్త మాత్రమే కాదు, సాహిత్య మేధావి కూడా. అతను నవరత్నాలు అని ప్రసిద్ధి చెందిన తొమ్మిది గ్రంథాలను రచించాడు. అవి వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, వైకుంఠ గద్యం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, నిత్య గ్రంథం, గీత భాష్యం, వేదాంత దీపం మరియు వేదాంత సార. రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన చిన్న జీయర్ స్వామి 2014లో సమానత్వ విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచనను ప్రతిపాదించారు.

statueofequality1

దీంతో రామానుజాచార్య 1000వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని తయారు చేయాలన్నారు. అతను ఊహించిన సమానత్వం యొక్క విగ్రహం రామానుజ జీవితం మరియు అతని తత్వశాస్త్రం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇది రోజువారీ సంద‌ర్శ‌న‌ కోసం ఉద్దేశించిన స్థలిగా పేరుగాంచింది.

పంచ‌లోహ విగ్ర‌హ నిర్మాణ శైలి

ఈ సమానత్వ విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి మరియు టైటానియం మిశ్రమం పంచలోహ పూత‌తో కప్పబడిన కాంక్రీట్ కోర్ కలిగి ఉంది. ఈ విగ్రహాన్ని భద్ర వేదిక అనే మూడు అంతస్తుల భవనంపై నిర్మించారు. ఈ భవనం పైన 36 ఏనుగులు మోసుకెళ్లే 27 అడుగుల ఎత్తు ఉన్న కమలం ఉంది. పద్మపీఠం అని పిలువబడే పద్మాకారపు వేదికపై విగ్రహం ఉంది.

statueofequality

54 అడుగుల ఎత్తైన భద్ర వేదిక బేస్ బిల్డింగ్‌లో రామానుజాచార్యుల రచనల మ్యూజియం, లైబ్రరీ మరియు ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ ఉన్నాయి. ఇందులో 120 కిలోల బంగారంతో చేసిన 54 అంగుళాల ఎత్తైన రామానుజుల విగ్రహంతో కూడిన ధ్యాన మందిరం కూడా ఉంది. విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలు (నమూనా దేవాలయాలు) మినీ ప్రతిరూపాలు ఉన్నాయి. ఈ ప్రతిరూపాలు రాతితో నిర్మించబడ్డాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+