ప్రపంచంలో చాలా పురాతనమైన దేవాలయాలున్నాయి. కొన్ని దేవాలయాల గురించి మనకు సరిగా తెలియదు. వాటి వెనుక కొన్ని రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అలాంటి రహస్య దేవాలయాల్లో ఒకటి శివుడి ఆలయం. ఈ ఆలయం 6000సంవత్సరాల కాలం నాటిదని అంటుంటారు. 6వేల సంవత్సరాల కంటే అతి పురాతనమైన ఈ శివాలయంలోని పరమశివుడు భక్తులకు నిత్యం దర్శనమిస్తుంటాడు.
ఈ ప్రాచీనమైన, అత్యంత పవిత్రమైన శివలింగం ఒక గుహలో ఉంది, అందుకే ఈ శివలింగం గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ శివలింగం గురించి పెద్ద విశేషమేంటని అందురూ అనుకోవచ్చు. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, శివలింగాన్ని నదిలోని నీరు నిరంతరం అభిషేకిస్తుంటుంది. ఇంకా పాండవుల మరియు కౌరవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు మహాభారత సమయంలో ఇక్కడే ద్యానం చేసేవారని, అందుకే ఈ గుహను ద్రోణ కేవ్ అని పిలుస్తారు. మరి ఈ ద్రోణ కేవ్ కు తప్కేశ్వర్ టెంపుల్ అని ఎలా పేరు వచ్చింది, ఈ టెంపుల్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం..
తపకేశ్వర్ మహాదేవ్
అతి ప్రాచీనమైన మరియు 6000 సంవత్సరాల కంటే అతి పురాతనమైన ఈ గుహలోని పరమశివున్ని తపకేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. ఈ ఆలయం డెహ్రుడూన్ లోని ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో కలదు.
PC:YOUTUBE
నీరు నిరంతరం ఆ శివలింగంపై నీటి ధారగా పడుతుంది
సహజ సిద్దంగా ఏర్పడిన తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం గుహపై ఉండే నీరు నిరంతరం ఆ శివలింగంపై నీటి ధారగా పడుతుంది. ‘‘తపక్’’ అనేది హింది పదం. తపక్ అంటే నీటి బొట్టు అని అర్థం. ఈ గుహ యొక్క పై కప్పు నుండి సహజంగా నీటి బొట్లు శివలింగంపై పడుతుంటాయి(అభిషేకిస్తుంటాయి). ఇది చూడటానికి భక్తులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఈ శివాలయానికి అంత ప్రత్యేకత ఉంది.
PC:YOUTUBE
మహాభారతంలోని ప్రసిద్ద గురువు
ఇంకా పురాణాల ప్రకారం భారత ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలోని ప్రసిద్ద గురువు ద్రోణాచార్యులు. అతని కుమారుడు అశ్వద్ధామ, ఈ గుహలోని శివునికి నిత్యం పాలాభిషేకం చేసేవాడని చెబుతుంటారు.
PC:YOUTUBE
దీని వెనుక ఒక కథ కూడా ఉంది.
దీని వెనుక ఒక కథ కూడా ఉంది. ద్రోణాచార్యుడు తన భార్యతో ఈ గుహలో నివాసం ఉన్నప్పుడు అశ్వద్దామ పుట్టిన తర్వాత పాలు ధారగ మారి పసివాడి ఆకలి తీర్చిందని అంటుంటారు. కారణం తల్లి క్రుపారాణికి ప్రసవం తర్వాత పాలు రాకపోవడమే. ఇప్పటికి ఈ లింగముపైన నీటి ధార పడటం విశేషంగా చెప్పుకుంటారు.
PC:YOUTUBE
ఇక్కడ శివలింగముకు చేసే విశేష అలంకరణలు
ఇక్కడ శివలింగముకు చేసే విశేష అలంకరణలు చాలా బాగుంటాయి.కాబట్టి ఇప్పటికే మీకు అర్థం అయ్యుంటుంది. ఈ కథ ద్వారా ఈ ఆలయం మహాభారత కాలంనాటి శివాలయం అని. ఇక్కడ మహా శివరాత్రి నాడు పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే లార్డ్ శివ, పార్వతుల యొక్క పవిత్రమైన కళ్యాణోత్సవ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయంను సందర్శిస్తారు.
PC:YOUTUBE
హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా
హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో చూడదగ్గ ముఖ్యమైన ఆలయం ఇది. ఈ తపకేశ్వర్ మహదేవ్ ఆలయం డెహ్రుడూన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్రోణ గుహ చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
PC:YOUTUBE
ఇది పిక్ నిక్ స్పాట్ కు సరైన ప్రదేశం.
యంగ్స్టర్స్ ఈ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లేకపోవచ్చు. కానీ, ఇది పిక్ నిక్ స్పాట్ కు సరైన ప్రదేశం.సాదారణంగా డెహ్రాడూన్ మరియు చుట్టుప్రక్కల జిల్లాల వారు పిక్నిక్ స్పాట్ గా ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు.
PC:YOUTUBE
అటవీ మార్గం నుండి ఒక చిన్న ట్రెక్కింగ్ చేయవచ్చు.
అటవీ మార్గం నుండి ఒక చిన్న ట్రెక్కింగ్ చేయవచ్చు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తోటి ట్రెక్కింగ్ వల్ల సౌకర్యంగాను మరియు ఉత్తేజంగాను ఫీలవుతారు.
PC:YOUTUBE
ఒక్క సారి ఆ ప్రదేశంలోనికి ప్రవేశించగానే
అంతే కాదు ఒక్క సారి ఆ ప్రదేశంలోనికి ప్రవేశించగానే అక్కడ వినిపించే పవిత్రమైనటువంటి పాటలు, దేవాలయంలోని గుడి గంటలు తన్మయత్వానికి గురి చేసి మరో ప్రపంచానికి తీసుకెళుతుంది.
PC:YOUTUBE
ఎలా వెళ్లాలి:
డెహ్రూడూన్ మెయిన్ సిటీకి చాలా దగ్గర. గోవింద నగర్ రైల్వే ష్టేషన్ నుండి 7.5కిలోమీటర్లు. ఇక్కడ నుండి బస్ లేదా క్యాబ్ లో వెళ్లవచ్చు.
PC:YOUTUBE
ఎలా వెళ్లాలి:
అలాగే జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ డ్రెహ్రూడూన్ నుండి 30కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది. మీరు కావాలంటే క్యాబ్ షేర్ చేసుకోవచ్చు.
PC:YOUTUBE
తప్కేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం:
శివరాత్రి సమయంలో చాలా బాగుంటుంది. ఇక శివ భక్తులు మాత్రం సంవత్సరం మొత్తం ఈ శివాలయాన్ని సందర్శిస్తుంటారు. సాధారణ భక్తులు అక్టోబర్ నుండి జూన్ మద్య వెళ్లడం మంచిది.
PC:YOUTUBE