గంగానది కుడివైపు ఒడ్డున రాంనగర్ కోట మరియు మ్యూజియం ఉన్నాయి . రాంనగర్ కోటను 17వ శతాబ్దంలో రాజా బల్వంత్ సింగ్ నివాస కాంప్లెక్స్ గా నిర్మించారు. మహాభారతంలోని ఋషి వేద్ వ్యాస్ ధ్యానం చేసిన ప్రదేశము రాంనగర్ లో ఉంది. నిజానికి ఈ ప్రదేశమునకు వ్యాస్ కాశీ అని వేద్ వ్యాస్ పేరు పెట్టడం జరిగింది. రాంనగర్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల సమయంలో 31 రోజుల పాటు నిర్వహించే రామలీల చాలా ప్రసిద్ధి చెందింది.
మ్యూజియంలో అనేక అందంగా చెక్కిన బాల్కనీలు, అద్భుతమైన మంటపాలు మరియు బహిరంగ చావడి ఉన్నాయి. ఇది పాలకుల కాలంలో మ్యూజియం విద్యా మందిరం కోర్టును సూచిస్తుంది. మ్యూజియంలో పురాతన గడియారములు, పాత ఆయుధాగారం, కత్తులు, పాత తుపాకులు, పాతకాలపు కార్లు, మరియు దంతపు వర్క్, రాచరికానికి సంబంధించిన వస్తువుల ఆసక్తికరమైన సేకరణ కలిగి ఉంది. మీరు కూడా రాజ కుంటుంబాలకు చెందిన మధ్యయుగ దుస్తులు, ఆభరణాలు, మరియు ఫర్నిచర్ లను చూడవచ్చు.