చెన్నైకి శివారు ప్రాంతంలో ఉన్న మైలాపూర్ లో కాపాలీశ్వర్ ఆలయం ఉంది. శివపార్వతులకి ఈ ఆలయం అంకితమివ్వబడినది. ఈ ఆలయంలో 'కర్పగంబాల్' లేదా 'కోరికలను తీర్చే దేవత' రూపం లో పార్వతీ దేవిని కొలుస్తారు.
'కపాలం' అంటే తల, శివుని మరో పేరు అయిన 'ఈశ్వర్' రెండు పదాల నుండి ఈ ఆలయం పేరు ని గమనించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు అలాగే శివుడు కైలాస పర్వతం వద్ద కలసుకున్నప్పుడు శివుని గొప్పదనాన్ని బ్రహ్మ గుర్తించలేదన్న కోపం తో బ్రహ్మ యొక్క నాలుగు తల ల లో ఒక తలని బలం గా లాగివేస్తాడు. ఆ తప్పుని సరిదిద్దుకునేందుకు బ్రహ్మ దేవుడు మైలాపూర్ కి వచ్చి ఒక శివ లింగాన్ని స్థాపిస్తాడు.
పల్లవ రాజులచే 7 వ శతాబ్దం లో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని నమ్ముతారు. ద్రావిడ నిర్మాణ శైలి లో ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతం సాంతోం చర్చ్ ఉన్న ప్రాంతం లో అసలైన ఆలయం ఉండేదని అంటారు. పోర్టుగీసు చేత ఆ ఆలయం ద్వంసం చేయబడిన తరువాత 16 వ శతాబ్దం లో విజయనగర రాజులూ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు.
రామకృష్ణ టెంపుల్, కాళికాంబాల్ టెంపుల్, సాంతోం చర్చ్ మరియు కపాలీశ్వర్ టెంపుల్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు చెన్నై ప్రసిద్ది చెందినది. చోలమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్ అనబడే విశిష్ట అంశానికి ఈ ప్రాంతం పేరొందింది.
ఎండాకాలం లో వాతావరణం తీవ్రంగా వేడి కలిగి ఉంటుంది. చలికాలం లో చలి అంత తీవ్రతరం కాదు. చెన్నైకి వాయు, రోడ్డు అలాగే రైలు మార్గాల ద్వారా సులభం గా చేరుకోవచ్చు.