కొల్లాం నుంచి 25 కి.మి. దూరం లో ఉన్న తేవల్లి ప్యాలస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగిన సాంస్కృతిక భవనం. ఒకప్పుడు ట్రావంకోర్ రాజు ఆస్థానమైన ఈ చారిత్రక భవనానికి అష్టముడి సరస్సు నుంచి పడవ ప్రయాణం ద్వారా వెళ్ళొచ్చు. 1811 -1819 ప్రాంతం లో గౌరి పార్వతి బాయి పాలిస్తున్నపుడు నిర్మించబడ్డ ఈ భవనం లో రాజు బ్రిటిష్ అధికారులతో సమావేశాలు జరిపేవారు.
ఈ ప్యాలస్ యొక్క ఆర్కిటెక్చర్ లో మిళితమైన బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ శైలులు ఆనాటి రాచవైభవాన్ని కళ్ళకి కడతాయి. పూర్తిగా సున్నపు రాయి, ఎర్ర మట్టి తో కట్టబడిన ఈ భవనం చూపరులని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అందులోనూ ఈ భవనం సరస్సు ప్రాంతం లో ఉండటం వల్ల దీని అందం మరింత ఇనుమడించింది. భవన పరిసరాల్లో "సాస్థ" దేవుడి గుడి ఉంది.