కరుమడి కుట్టాన్ అనగా కరుమడి కి చెందినవాడు అని అర్ధం. ఇక్కడ ప్రతిష్టింపబడిన బుద్దుడికి పెట్టిన పేరు ఇది. భారత దేశానికి చెందిన వివిధ సంస్కృతులు మరియు వివిధ రాష్ట్రాలకు క్రమక్రమంగా బుద్దిజం వ్యాపించింది. ఆ బుద్దిజం కి సంబందించిన గుర్తులు కొన్ని ప్రాంతాలలో ఇంకా గమనించవచ్చు.
అలాంటి వాటిలో అలెప్పి లో ఉన్న కరుమడి కుట్టాన్ ఒకటి. 9 వ శతాబ్దానికి చెందిన ఈ కరుమడి కుట్టాన్ బుద్దిజానికి జ్ఞాపకార్ధం. అటువంటి ఎన్నో పురాతన వస్తువులు గుర్తించబడినా , ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ సంబంధిత హింస వల్ల కొన్ని మిగలలేదు. అటువంటివి ఎన్నో తట్టుకుని నిలబడినది ఈ గ్రానైట్ విగ్రహం. కేరళ లో ఉన్న ఏకైక బుద్ధుడి గుడి ఇది.
ఏనుగుల దాడి వల్ల ఈ విగ్రహానికి కొంచెం నష్టం జరిగినా, అత్యంత మంది భక్తుల్ని మరియు పర్యాటకులనీ ఈ గుడి అమితంగా ఆకర్షిస్తోంది. కాలానికి అతీతంగా ఉన్న ఈ గుడిని సందర్శించేందుకు ఏంతో మంది తరలివస్తున్నారు.