అవన్తిపూర్ లో శివ అవన్తీశ్వర దేవాలయం ప్రధాన ఆకర్షణ. దేవాలయం చుట్టూ అతి పెద్ద గోడలు వుంటాయి. ఈ టెంపుల్ అవన్తిపూర్ లోని రెండు దేవాలయాల లోను పెద్దది. దీనిని మొదటి ఉత్పల రాజు అయిన సుఖ్ వర్మన్ కుమారుడు అవంతి వర్మన్ మహా దేవుడుగా చెప్పబడే లయకారుడు శివుడు కొరకు నిర్మించాడు.
కాల క్రమంలో ఈ టెంపుల్ భూమిలో కలసి పోయింది. అయితే, సుమారు 18 వ శతాబ్దం లో బ్రిటిష్ వారు ఈ ప్రదేశం లో తవ్వకాలు జరిపి గుడిని వెలికి తీసారు. ప్రస్తుతం తవ్వి వెలికి తీయ బడిన కళాకృతులు శ్రీ నగర్ లోని శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం లో చూడవచ్చు.
ఈ టెంపుల్ ఆనాడు ఆ ప్రాతంలో కల శిల్ప శైలి ని చాటుతుంది. అయితే, కాల క్రమం లో అది శిధిలమవటం, దానిపై సుల్తాన్ సికందర్ దాడి చేసి ధ్వసం చేయటం కూడా జరిగింది. ఈ టెంపుల్ లో వివిధ దేముళ్ళు , దేవతలను కూడా వివిధ రూపాలలో చూడవచ్చు. బాగా గమనిస్తే , శివ అవన్తీస్వర టెంపుల్ గోడలు మరో సారి మరమ్మతులు చేయబడినట్లు గా కూడా కనపడుతుంది.