అయోధ్య లో ఎక్కువ గా సందర్శించాబడే పవిత్ర క్షేత్రాలలో ఒకటి హనుమాన్ గర్హి లేదా హనుమంతుని నివాసం. హనుమంతుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. అయోధ్య లో ని ఒక మట్టి దిబ్బ పై నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని దూరం నుంచి కూడా వీక్షించవచ్చు. ఈ ఆలయానికి చేరడానికి 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.
అవధ్ నవాబ్ ఈ ఆలయం నిర్మించడానికి స్థలం ఇచ్చారు. పదవ శతాబ్దం మధ్యలో ఆయన ఉంపుడుగత్తెలలో ఒకరి చేత ఈ ఆలయం నిర్మించబడినది.
హనుమాన్ గర్హి ఒక కేవ్ టెంపుల్. చదరపు ఆకృతి కలిగిన కోట లాంటి భవనం లో ఇది ఉంది. ఈ భవనం లో వృత్తాకారం కోట బురుజులు నలు మూలలా ఉన్నాయి. ఈ ఆలయం లో ని గర్భ గుడి లో ని అంజలీ దేవి బాల హనుమానుని తన ఒడిలో ఉంచుకున్న ప్రతిమ కనిపిస్తుంది.
ఈ ఆలయం ఆధ్యాత్మిక పరం గా నే కాకుండా నిర్మాణ పరం గా కూడా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ చిరకాల కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. అందువల్ల, ఏడాది పొడవునా ఈ ఆలయానికి అధిక సంఖ్య లో భక్తులు విచ్చేస్తారు.