శ్రీ రాముని జన్మ స్థలమైన అయోధ్య ఏడాది పొడవునా భక్తులతో , పర్యాటకులతో అత్యంత రద్దీగా ఉంటుంది .ఈ నగరం లోని అనేక దేవాలయాలు , ఘాట్లు , చారిత్రిక భవనాలు మరియు స్మారకాలు విశేష మయిన రద్దీ కి కారణం . పండుగ సమయాలలో ఈ రద్దీ మరీ అధికం గా ఉంటుంది .
రామ్ కథ పార్క్ ఈ ఆధ్యాత్మిక ప్రదేశాల లోని రద్దీ నుండి ఉపసమనం కలిగించటానికి నిర్మించ బడినది. నగరం యొక్క జనం తాకిడి నుండి దూరంగా చక్క గా నిర్వహించబడే అందమైన ప్రసాంతమైన ఉద్యానవనం . ఇక్కడి ఓపెన్ ఎయిర్ థియేటర్ ల లో సంస్కృతిక , ఆధ్యాత్మిక , మతపరమైన అనేకే కార్యక్రమాలను నిర్వహిస్తారు .
ఎల్లపుడు ఈ పార్క్ సందర్సకులతో అనేక ఆధ్యాత్మిక చర్చలు, ఇతర మతపర కార్యక్రమాలతో సజీవం గా ఉంటుంది . అంతేకాక ఇక్కడి థియేటర్ ల లో స్థానిక ,స్థానికేతర కళాకారులు నాట్యం , కవిత్వం , సంగీతం వంటి కళలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్సించుకునే వీలు కలిగిస్తున్నది .ఈ పార్క్ వయోబేధం లేకుండా పిన్న పెద్దలు సాయం సమయాలలో , వారాంతం లో సందర్శించే ఆధ్యాత్మిక ప్రశాంత ప్రదేశంగా చెప్పవచ్చు .