బెంగళూరుకు దక్షిణం గా 21 కిలోమీటర్ల దూరంలో దీనిని 1981 లో శ్రీ శ్రీ రవి శంకర్ స్థాపించారు. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని తయారు చేయడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఇప్పటి దాక ఈ ఆశ్రమ సందేశం 150 దేశాల్లోని 30 కోట్ల మంది అనుయాయుల్ని చేరుకుంది. కానీ బెంగళూరు లోని ఈ సంస్థనే ఇప్పటికీ తమ ప్రధాన స్థావరం ఉంచారు.
సామాజిక వ్యాపార దృక్పథం తో ఈ కేంద్రం తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దైనందిన జీవితంలోని ఒత్తిళ్ళ నుంచి విముక్తుల్ని చేసేందుకు యోగా, ధ్యానం నేర్ప్సితారు. ఇప్పుడు వారి కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తం గా సుప్రసిద్ధ౦ అయ్యాయి.ఈ సామాజిక ఆధ్యాత్మిక కేంద్రం గడచినా శతాబ్దాల్లో మనవహిత కార్యక్రమాల్లో పాల్గొని CONGO లాంటి అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం కలిగి వుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పైనా, ధ్యానం పైనా ఈ కేంద్రం శిక్షణా కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి మీ పర్యటన లో కొద్ది రోజులు ఇక్కడ గడిపి ఆధ్యాత్మిక ఆనందం తో వెనుతిరగ వచ్చు.