కురుదుమలె కర్నాటకలోని కోలార్ జిల్లాలో కలదు. ఇది ఒక యాత్రా స్ధలం. కురుదుమలె లోని గణేశ భగవానుడి విగ్రహం చాలా మహిమ కలదని ఇతిహాసాలు చెపుతున్నాయి. ఈ గణేశుడి విగ్రహాన్నిత్రిమూర్తులైన శివ, బ్రహ్మ మరియు విష్ణు మూర్తి కలసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెపుతోంది. ఈ విగ్రహానికి దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు.
ఇతిహాసాలలో కురుదుమలె స్ధానం ఏమిటి? కురుదుమలె గురించిన ఎ్నో కధలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పేరులోని మాటలైన కూడు మరియు మలై అంటే కలిసే ప్రదేశం అని అర్ధం చెప్పాలి. తమ వినోదం కొరకు దేవుళ్ళు అందరూ కలసి అక్కడకు వచ్చి కలుసుకునే ప్రదేశం అని చెపుతారు.
గణేష దేవాలయం లో 13.5 అడుగుల పొడవు విగ్రహం ఉంటుంది. ఈ నిర్మాణం రెండు విభిన్న రీతులలో నిర్మించబడింది. ఈ విభిన్న తీరులకు కారణం ఇతిహాసం మేరకు ఇద్దరు వాస్తు శిల్పులు, తండ్రి, కుమారుడు అయిన జనకాచారి మరియు డంకనాచారి కలసి దీనిని నిర్మించారని తెలుస్తోంది. కురుదుమలె లోని సోమేశ్వర దేవాలయం భగవాన్ శివ విగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఇది గణేశ దేవాలయంకంటే కూడా ప్రాచీనమైంది. ఈ దేవాలయం చోళుల పాలనాకాలం నాటిది. కురుదుమలె బెంగుళూరు విమానాశ్రయానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో కూడా తేలికగా చేరవచ్చు.