కురుదుమలె లోని గణేశ దేవాలయం భక్తులచే ఎంతో మహిమాన్వితమైనదిగాను, పవిత్రమైనదిగాను పరిగణించబడుతుంది. నిర్మాణం తీరు, గోడలపై గల చెక్కడాలు పరిశీలిస్తే, ఈ దేవాలయం విజయనగర రాజుల కాలం నాటిదని తెలుస్తోంది. ఇతిహాసం మేరకు ఈ దేవాలయంలోని గణేశ విగ్రహాన్ని హిందువుల ఆరాధ్య దైవాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతిష్టించారు. వీరు ముగ్గురూ కలిసి గణేశుని ఇక్కడ అర్చించారు. అయితే, ఈ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారనేదానికి రుజువులు, సాక్ష్యాలు లేవు. దేవాలయంలోని గణేశ విగ్రహం పెద్దది. సుమారు 14 అడుగుల ఎత్తు కలది. చాలా సంవత్సరాలు అది బహిరంగ స్ధలంగానే ఉండగా, విజయనగర పాలకులు క్రిష్ణదేవరాయులు దీనికి దేవాలయం నిర్మించారని చెపుతారు. ఈ దేవాలయానికి భక్తులు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం దేశంలోని వివిద ప్రాంతాలనుండి తరలి వస్తారు.