పర్యాటకులు తమ సందర్శనలో 1580 నుండి 1627 వరకు పాలించిన రెండవ ఇబ్రహీం అదిల్ షా నిర్మించిన ఇబ్రహీం రౌజా తప్పక చూడాలి. ఈ భవనం మాలిక్ శాండల్ డిజైన్ చేశారు. దీనిని దక్కన్ సామ్రాజ్య తాజ్ మహల్ గా అభివర్ణిస్తారు. ఇబ్రహీం రౌజాకు కుడివైపున ఒక మసీదు, నాలుగు గోపురాలు మరియు ఎడమవైపు ఒక సమాధి ఉన్నాయి. మసీదులో చతురస్రపు ప్రార్ధనా మందిరం మరియు అయిదు అర్చీలు ముందరి వరుసలో ఉంటాయి. ఈ గోపురాలను అంతస్తులుగా కూడా తీర్చిదిద్దారు. గోళాకారపు డోమ్ ఒకటి అందమైన పూల రేకులతో నిర్మించబడింది. సమాధి మరియు మసీదు రెండూ కూడా ఒక తోట మధ్య భాగాన ఉంటాయి. ఎంతో అందమైన ఈ చారిత్రక చిహ్నాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. భారతీయులకు మరియు సార్క్ దేశాల పర్యాటకులకు, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, ధాయిలాండ్ సందర్శకులకు రూ. 5 మరియు ఇతర దేశాలవారికి అమెరికా డాలర్లు రెండు లేదా రూ.100 ప్రతిఒక్కరికి ప్రవేశ రుసుముగా వీటికి నిర్ణయించారు.



Click it and Unblock the Notifications