శ్రీనగర్ నుండి 28 కిలోమీటర్ల దూరం లో ఉన్న చ్రార్-ఎ-షరీఫ్ వద్ద ఉన్న షేక్ నూర్-ఉద్-దిన్ సమాధి, ఆలందర్-ఎ-కాశ్మీర్ లేదా కాశ్మీర్ యొక్క జెండాని ఆవిష్కరించే ప్రదేశం గా ప్రసిద్ది చెందింది. ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక ప్రచారం కాశ్మీర్ లోయలో చేసిన షేక్ నూర్-ఉద్-దిన్ నూరాని(RA) కి ఇది అంకితమివ్వబడినది. ఆఫ్ఘాన్ గవర్నర్ అయిన అట్టా మొహమ్మద్ ఖాన్ చేత షేక్ నూర్-ఉద్-దిన్ మరణం తరువాత నాణేలు విడుదల చేయబడ్డాయి.
ఆలందర్-ఎ-కాశ్మీర్ యొక్క శిష్యుడు సంగ్రం దార్ ఒక మసీదు ని ఇక్కడ నిర్మించారు. షేక్ నూర్-ఉద్-దిన్ నూరాని ఈ మసీదులోనే ప్రతీ శుక్రవారం ప్రార్ధనలు జరిపేవాడు. ఆలందర్-ఎ-కాశ్మీర్ చనిపోయిన తరువాత ఈ ప్రదేశం లో నే అతని శవాన్ని అతని వారసులు కొంత ఊరేగింపు తరువాత పూడ్చి పెట్టారు.