చెన్నై లోని అష్టలక్ష్మి ఆలయం సంపదకు, శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీదేవి, రెండవ అవతారాలుగా నమ్మే ఎనిమిది హిందూ దేవతలకు అంకితం చేయబడింది. ఈ దేవత కూడా విష్ణుమూర్తి భార్యే. పురాణాల ప్రకారం, లక్ష్మీ దేవి మన జీవితంలో సంపాద తరువాత ఆరోగ్యం, జ్ఞానం, సంతానం, శక్తి, బలం మొదలైన రూపాలలో కనిపిస్తుంది. అష్టలక్ష్మి దేవతను ఎల్లపుడూ ఒక గుంపుగా పూజిస్తారు.
ఈ ఆలయం బిసెంట్ నగర్ బీచ్ తీరం మీద ఉంది, ఇక్కడ నాలుగు స్థాయిలు ఉన్నాయి. ఈ ఆలయం వద్ద ఎనిమిది దేవతల విగ్రహాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. మహాలక్ష్మి, మహావిష్ణు దేవతల మందిరాలు ఉన్న రెండవ స్థాయి నుండి ఈ దేవతలను పూజించడం ప్రారంభిస్తారు. మూడవ భవనంలో శాంత లక్ష్మి, విజయ లక్ష్మి, గజలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ భవనంలో ఒక్క ధనలక్ష్మి దేవత విగ్రహం మాత్రమే ఉంది. మొదటి భవనంలో ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications