ఒరిస్సాలోని పూరి కి జగన్నాథ యాత్రకి వెళ్ళే భక్తుల కోసం ఈ జగన్నాథ ఆలయం చెన్నై లో నిర్మించబడినది. రెడ్డి కుప్పం రోడ్ లో ఉన్న ఈ ఆలయం లో జగన్నాథ స్వామి విగ్రహం, సుభద్రా దేవి విగ్రహం అలాగే బలరాముడి విగ్రహాలు ఉన్నాయి. యోగానరసింహ స్వామి ప్రతిమని ఈ ఆలయం లోపల గమనించవచ్చు. శివుడు, గణపతి, విమలా దేవి అలాగే గజలక్ష్మి దేవిలని కూడా ఈ ఆలయంలో పూజిస్తారు.
పూరిలోని జగన్నాథ ఆలయాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయం ఉంది. నల్ల గ్రానైట్ రాయి తో అలాగే తెల్లటి పాల రాయితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కాంచీపురం నుండి ప్రత్యేకంగా ఈ గ్రానైట్ ని తీసుకువచ్చారు. పాలరాతిని రాజస్తాన్ నుండి తీసుకువచ్చారు. పూరి ఆలయంలోని విగ్రహాలని తయారు చేసే వేప చెక్కతో ఈ ఆలయం యక్క దేవుళ్ళ, దేవతల ప్రతిమలను చెక్కారు. ఏడాది మొత్తం రంగు రంగుల పూలు పూచే అందమైన ప్రక్రుతి నడుమ విస్తృతమైన ప్రాంతం లో ఈ ఆలయం నిర్మించబడినది. ఈ పూలు పూజకి ఉపయోగిస్తారు.