పూర్ణత్రయేశ దేవాలయం త్రిపునితురలో కలదు. చొట్టనిక్కరలో ఇది ఒక ప్రధాన మతపర స్ధలం. ఈ దేవాలయంలో పూర్ణత్రయేశ అంటే విష్ణు దేవుని అవతార విగ్రహం కలదు. 1900 సంవత్సరంలో అగ్ని ప్రమాదం తర్వాత ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దేవాలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలదు. చరిత్ర మేరకు, పూర్ణత్రయేశ దైవం కొచ్చి రాజ్య రాజ కుటుంబంచే అర్చించబడింది. ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని నమ్మకం కలదు. ఈ దేవాలయంలో జరిగే ప్రతి సంవత్సర ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రధాన ఉత్సవమైన వ్రుశ్చికోత్సవం నవంబర్ - డిసెంబర్ లలో జరుగుతుంది. ఉత్సవాలు చూడాలనుకునేవారు ఈ సమయంలో రావాలి.