కూర్గ్ జిల్లా మడికెరిలో రాజాస్ సీట్ అనేది ఒక ప్రధాన ప్రదేశం. ఇది వివిధ సీజన్లలో పూసే పూల చెట్లతో మరియు అందమైన ఫౌంటెన్లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ కల ఫౌంటెన్లు సంగీతాన్ని అందిస్తాయి. రంగు రంగుల నీటి ధారలను వీనుల విందైన సంగీతంతో వెదజల్లుతూ వినోదం కలిగిస్తాయి.
కొడగు రాజులు ఈ ప్రదేశం తమ వినోదాలకు ఉపయోగిచేవారు కనుకనే దీనికి రాజాస్ సీట్ అనే పేరు వచ్చింది. ఈ కట్టడాన్ని ఇటుక, సున్నం వంటి వాటితో నిర్మించారు. స్తంభాలు మరియు ఆర్చీలు కలిగి ఉంటుంది. కొడగు రాజులకు ఈ ప్రదేశం ఎంతో ఇష్టంగా ఉండి వారు తమ రాణులతో కలసి విహరించేవారని చెపుతారు.
ఈ కట్టడం సమీప కొండలు, లోయల కంటే ఎత్తుగా నిర్మించటంతో ఈ ప్రదేశంనుండి చూస్తే పరిసరాలు బాగా కనపడతాయి. బంగారు కాంతులను వెదజల్లే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఈ ప్రదేశ పర్యాటకులకు మరువలేని అనుభూతులనిస్తాయి. ఈ ప్రదేశంలోనే పిల్లలు ఆనందించేందుకు, మరింత ఆకర్షణగా ఒక టాయ్ ట్రైన్ కూడా కలదు.