ఈ నగరం యొక్క చారిత్రక కట్టడం గా దిండిగల్ ఫోర్ట్ ని చెప్పవచ్చు. దిండిగల్ కొండలపైన 280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటని మదురై రాజు అయిన ముత్తు కృష్ణ నయికర్ నిర్మించాడు. అప్పటి నుండి ఇది ఎంతో మంది పాలకులను చూసింది. 18 వ శతాబ్దం లో టిప్పు సుల్తాన్ పరిపాలించిన ఈ కోట తరువాత కాలం లో బ్రిటిష్ వారి అధీనం లో కి వెళ్ళింది. చారిత్రక నిర్మాణాలు అంటే ఆసక్తి గల ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన ప్రముఖ కట్టడం ఈ కోట.