ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం ఇంకా ఓపెన్ ఎయిర్ ధియేటర్ తో పాటు సాంప్రదాయ వైష్ణవ ఆలయం కలిగిన ప్రదేశం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర. ఈ సాంస్కృతిక సంస్థ 1990 లో రాష్ట్ర ప్రభుత్వం చేత స్థాపించబడినది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఈ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడం. వైష్ణవ మతాన్ని దేశం లో ని ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన శ్రీమంత శంకరదేవ మహర్షి పేరే ఈ పంజాబరి లో ఉన్న ఈ కళాక్షేత్రానికి పెట్టారు.
ఆర్ట్ గ్యాలెరీ మరియు ఇతర ఆకర్షణలతో పాటు ఈ శ్రీమంత సంకరదేవ కళాక్షేత్ర లో సాహిత్య భవన్ లైబ్రరీ అనే గ్రంధాలయం ఉంది. ఇక్కడ పురాతన అస్సామీస్ సాహిత్యం తో పాటు అసలైన వ్రాత ప్రతులను భద్రపరిచారు. ప్రదర్శనల కోసమే ఈ కళాక్షేత్రం లో లలిత కళా భవన్ అనే ప్రత్యేక ప్రాంతం కలదు. ఈ లలిత కళా భవన్ లో వర్క్ షాపులు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు తరచూ నిర్వహిస్తారు.
అస్సామీ గ్రామం లా కనిపించేటట్టు ఏర్పాటు చేసిన కృత్రిమ గ్రామం ఇక్కడి ప్రధాన ఆకర్షణ్.



Click it and Unblock the Notifications