గువహతి లో ఉన్న ప్రసిద్దమైన పుణ్యక్షేత్రాలలో వశిష్ట ఆశ్రమం ఒకటి. ఈ ఆశ్రమం అహోం రాజు రాజ రాజేశ్వర్ చేత 18 వ శతాబ్దం ద్వితీయార్ధం లో నిర్మించబడినది. సంధ్య, కాంత మరియు లలితా అనబడే మూడు నదుల సంగమం వద్ద ఈ సంధ్యచల్ కొండలపై ఈ ఆశ్రమం ఉంది.
ఆశ్రమానికి చేరే దారిలో ఈ నీళ్ళల్లో మునక పాపాలని తరిమివేసి వారి జీవితాలని ధన్యపరుస్తుంది అనే విశ్వాసం ఉంది. ఈ ఆశ్రమం తో వశిష్ట మహా ముని కి అనుబంధం ఉందనే నమ్మకం కూడా ఉంది. అతని ఆశీస్సుల వల్ల రాక్షస జాతికి చెందిన దైత్య కొడుకు అహోం ప్రాంతాన్ని కొన్ని శతాబ్దాల పాటు పాలించాడు.
వశిష్ట ఆశ్రమ సందర్శన మరువరానిది. ప్రశాంతమైన ఈ వాతావరణం హాయిని కలిగిస్తుంది. ప్రైవేటు వాహనం ద్వారా కాని లేదా స్పెషల్ బస్సుల ద్వారా కాని ఈ ఆశ్రమానికి చేరుకోవచ్చు.